+91 95819 05907

అదుపుతప్పిన పల్లె వెలుగు బస్సు… పలువురి కి తీవ్ర గాయాలు

నేటి గద్దర్, మే 12, భద్రాద్రి కొత్తగూడెం :

ప్రమాదవశాత్తు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్లిన సంఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మణుగూరు నుంచి భద్రాచలం వెళుతున్న మణుగూరు డిపోకు చెందిన TS 28 A 2219 అనే నెంబర్ గల ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బూర్గంపాడు మండల పరిధిలోని మోతే గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన సందర్భంలో బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపుతప్పడంతో ప్రధాన రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ప్రయాణికులలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా సుమారు పదిమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాల సేకరిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !