+91 95819 05907

వరి పంట పండించిన రైతులకి 500 రూపాయల బోనస్ తక్షణమే ఇవ్వాలి:ZPTC

మణుగూరు తాహసిల్దార్ వినతి పత్రం అందజేత…

మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు.

నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి (మణుగూరు) మే 16:

బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంట పండించిన రైతులందరికీ 500 రూపాయలు బోనస్ తక్షణమే చెల్లించాలని తహసిల్దార్ రాఘవరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన ధాన్యానికి ప్రతి కింటాకు 500 రూపాయలు బోనస్ యిస్తామని చెప్పి అధికారoలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిర్ణయాన్ని కేవలం సన్న వడ్లు పండించిన రైతులకు మాత్రమే బోనస్ అని సీఎం ప్రకటన రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.ఇప్పటి వరకు కొన్న వడ్లకి ఎక్కడ కూడ బోనస్ ఇచ్చిన దాఖలాలే లేవని అసలు దానికే దిక్కులేదు కోసరిది దేవుడు ఎరుగునని ఎద్దేవా చేశారు.ఇప్పుడు బోనస్ అనే మాయమాటలతో రైతులకు ఎగనామం పెట్టేటట్లు సీఎం ప్రకటన ఉన్నదని ఆరోపించారు. మొన్నటి వరకు రైతులకు రైతు బంధుకే దిక్కులేదని,ఇక బోనస్ సంగతి దేవుడెకే తెలియాలని , మోసపూరిత పథకాల, హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరిని మోసం చేస్తోందని మండిపడ్డారు.అసలు మన రాష్ట్రానికి గబ్బిలానికి గుడ్లగూబకు తేడా తెలియని ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసిందని,ఇలాంటి ముఖ్య మంత్రి ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు.తక్షణమే రైతులు పండించిన అన్ని రకాల ధాన్యానికి ప్రతి కింటాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని లేనిపక్షంలో రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, డైరెక్టర్ ఉడతానేని రవి, మణుగూరు రైతు సమితి మాజీ అధ్యక్షులు వెంకట రెడ్డి,తొగ్గూడెం ఎంపీటీసీ కనితి బాబురావు, కూనవరం మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ,మండల నాయకులు ముద్దంగుల కృష్ణ,బొశెట్టి రవి ప్రసాద్,కoభంపాటి శ్రీను, కలబోయిన సుబ్రహ్మణ్యం, సందీప్,హర్ష తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !