+91 95819 05907

వరి పంట పండించిన రైతులకి 500 రూపాయల బోనస్ తక్షణమే ఇవ్వాలి:ZPTC

మణుగూరు తాహసిల్దార్ వినతి పత్రం అందజేత…

మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు.

నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి (మణుగూరు) మే 16:

బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంట పండించిన రైతులందరికీ 500 రూపాయలు బోనస్ తక్షణమే చెల్లించాలని తహసిల్దార్ రాఘవరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన ధాన్యానికి ప్రతి కింటాకు 500 రూపాయలు బోనస్ యిస్తామని చెప్పి అధికారoలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిర్ణయాన్ని కేవలం సన్న వడ్లు పండించిన రైతులకు మాత్రమే బోనస్ అని సీఎం ప్రకటన రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.ఇప్పటి వరకు కొన్న వడ్లకి ఎక్కడ కూడ బోనస్ ఇచ్చిన దాఖలాలే లేవని అసలు దానికే దిక్కులేదు కోసరిది దేవుడు ఎరుగునని ఎద్దేవా చేశారు.ఇప్పుడు బోనస్ అనే మాయమాటలతో రైతులకు ఎగనామం పెట్టేటట్లు సీఎం ప్రకటన ఉన్నదని ఆరోపించారు. మొన్నటి వరకు రైతులకు రైతు బంధుకే దిక్కులేదని,ఇక బోనస్ సంగతి దేవుడెకే తెలియాలని , మోసపూరిత పథకాల, హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరిని మోసం చేస్తోందని మండిపడ్డారు.అసలు మన రాష్ట్రానికి గబ్బిలానికి గుడ్లగూబకు తేడా తెలియని ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసిందని,ఇలాంటి ముఖ్య మంత్రి ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు.తక్షణమే రైతులు పండించిన అన్ని రకాల ధాన్యానికి ప్రతి కింటాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని లేనిపక్షంలో రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, డైరెక్టర్ ఉడతానేని రవి, మణుగూరు రైతు సమితి మాజీ అధ్యక్షులు వెంకట రెడ్డి,తొగ్గూడెం ఎంపీటీసీ కనితి బాబురావు, కూనవరం మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ,మండల నాయకులు ముద్దంగుల కృష్ణ,బొశెట్టి రవి ప్రసాద్,కoభంపాటి శ్రీను, కలబోయిన సుబ్రహ్మణ్యం, సందీప్,హర్ష తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

 Don't Miss this News !