+91 95819 05907

వరి పంట పండించిన రైతులకి 500 రూపాయల బోనస్ తక్షణమే ఇవ్వాలి:ZPTC

మణుగూరు తాహసిల్దార్ వినతి పత్రం అందజేత…

మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు.

నేటి గద్దర్ ప్రత్యేక ప్రతినిధి (మణుగూరు) మే 16:

బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంట పండించిన రైతులందరికీ 500 రూపాయలు బోనస్ తక్షణమే చెల్లించాలని తహసిల్దార్ రాఘవరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన ధాన్యానికి ప్రతి కింటాకు 500 రూపాయలు బోనస్ యిస్తామని చెప్పి అధికారoలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిర్ణయాన్ని కేవలం సన్న వడ్లు పండించిన రైతులకు మాత్రమే బోనస్ అని సీఎం ప్రకటన రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.ఇప్పటి వరకు కొన్న వడ్లకి ఎక్కడ కూడ బోనస్ ఇచ్చిన దాఖలాలే లేవని అసలు దానికే దిక్కులేదు కోసరిది దేవుడు ఎరుగునని ఎద్దేవా చేశారు.ఇప్పుడు బోనస్ అనే మాయమాటలతో రైతులకు ఎగనామం పెట్టేటట్లు సీఎం ప్రకటన ఉన్నదని ఆరోపించారు. మొన్నటి వరకు రైతులకు రైతు బంధుకే దిక్కులేదని,ఇక బోనస్ సంగతి దేవుడెకే తెలియాలని , మోసపూరిత పథకాల, హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరిని మోసం చేస్తోందని మండిపడ్డారు.అసలు మన రాష్ట్రానికి గబ్బిలానికి గుడ్లగూబకు తేడా తెలియని ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసిందని,ఇలాంటి ముఖ్య మంత్రి ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు.తక్షణమే రైతులు పండించిన అన్ని రకాల ధాన్యానికి ప్రతి కింటాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరాల్సిందేనని లేనిపక్షంలో రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, డైరెక్టర్ ఉడతానేని రవి, మణుగూరు రైతు సమితి మాజీ అధ్యక్షులు వెంకట రెడ్డి,తొగ్గూడెం ఎంపీటీసీ కనితి బాబురావు, కూనవరం మాజీ సర్పంచ్ ఏనిక ప్రసాద్,మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ,మండల నాయకులు ముద్దంగుల కృష్ణ,బొశెట్టి రవి ప్రసాద్,కoభంపాటి శ్రీను, కలబోయిన సుబ్రహ్మణ్యం, సందీప్,హర్ష తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !