+91 95819 05907

నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం:కోలేటి

కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే
★ బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువులిస్తే.. తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకు లు
★ మాయ మాటలు చెప్పే వారికి బుద్ధి చెప్పండి
★ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మద్దతు గా నిలబడండి
★ ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డి
★ ప్రశ్నించే గొంతుక అవుతాడు
★ యువ నాయకుడు రాకేష్ రెడ్డి ని శాసన మండలికి పంపిద్దాం
★నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సమావేశం
★హాజరు కానున్న BRS Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్
నేటి గద్ధర్ న్యూస్, పినపాక :నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని , ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరవుతారని భద్రాద్రి కొత్తగూడెం BRS అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పినపాక లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
త్వరలో జరగనున్న Mlc ఎన్నికల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని పట్టాభద్రుడు భారీ మెజార్టీతో గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ కోరారు. ఎన్నో ఏళ్లుగా గత పాలకుల చేతిలో నిర్లక్ష్యానికి గురైన వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసిన సుమారు 11 వేల కాంట్రాక్టు ఉద్యోగస్తులను మాజీ సీఎం KCR పర్మినెంట్D చేయడం జరిగిందన్నారు. అలాగే 40 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందన్నారు. ఈ అంశాలను విద్యావంతులు పరిగణలోకి తీసుకొని కెసిఆర్ కి మద్దతు తెలపాలని కోరారు.వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక Bits pilani లో ఉన్నత విద్యను పూర్తి చేయడమే కాకుండా గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉందన్నారు. అలాంటి యువ నాయకున్ని ఎన్నుకుంటే మూడు జిల్లాల పరిధిలోని యువకులకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల కల్పనకు కృషి చేయడంతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అవతారని కోలేటి అన్నారు. పట్టభద్రులు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !