+91 95819 05907

నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం:కోలేటి

కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ దే
★ బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువులిస్తే.. తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకు లు
★ మాయ మాటలు చెప్పే వారికి బుద్ధి చెప్పండి
★ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మద్దతు గా నిలబడండి
★ ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డి
★ ప్రశ్నించే గొంతుక అవుతాడు
★ యువ నాయకుడు రాకేష్ రెడ్డి ని శాసన మండలికి పంపిద్దాం
★నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సమావేశం
★హాజరు కానున్న BRS Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్
నేటి గద్ధర్ న్యూస్, పినపాక :నేడు మణుగూరు కిన్నెర కళ్యాణ మండపం లో ఉ దయం 10 గంటల కు BRS ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని , ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరవుతారని భద్రాద్రి కొత్తగూడెం BRS అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పినపాక లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
త్వరలో జరగనున్న Mlc ఎన్నికల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని పట్టాభద్రుడు భారీ మెజార్టీతో గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ కోరారు. ఎన్నో ఏళ్లుగా గత పాలకుల చేతిలో నిర్లక్ష్యానికి గురైన వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసిన సుమారు 11 వేల కాంట్రాక్టు ఉద్యోగస్తులను మాజీ సీఎం KCR పర్మినెంట్D చేయడం జరిగిందన్నారు. అలాగే 40 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందన్నారు. ఈ అంశాలను విద్యావంతులు పరిగణలోకి తీసుకొని కెసిఆర్ కి మద్దతు తెలపాలని కోరారు.వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక Bits pilani లో ఉన్నత విద్యను పూర్తి చేయడమే కాకుండా గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉందన్నారు. అలాంటి యువ నాయకున్ని ఎన్నుకుంటే మూడు జిల్లాల పరిధిలోని యువకులకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల కల్పనకు కృషి చేయడంతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అవతారని కోలేటి అన్నారు. పట్టభద్రులు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !