+91 95819 05907

నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:AO

ఏఓ రామగుడు వాణి..
నేటి గద్ధర్ న్యూస్, పాలేరు,( మే 16):
కూసుమంచి మండలంలోని ముత్యాలగూడెం గ్రామంలో రైతులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి మాట్లాడుతూ.. రైతులందరూ నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఎవరైనా గుడ్డ సంచులలో కానీ, నకిలీ లేబుల్ తో ఉన్న ప్యాకెట్లలో కానీ విత్తనాలు అమ్మినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వారి వద్ద విత్తనాలు తీసుకోవద్దని, లైసెన్స్ కలిగిన అధికృత డీలర్ నుండి మాత్రమే విత్తనాలను తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లును జాగ్రత్తపరచుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. అనంతరం వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమి లోపల పొరల్లో ఉన్న పురుగుల యొక్క అవశేషాలను నశింప చేయొచ్చని తెలిపారు. పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించారు. మట్టి పరీక్ష నమూనాలను ఏ విధంగా సేకరించాలి, మట్టి పరీక్ష ఫలితాల విశ్లేషణ గురించి తెలియజేశారు. అనంతరం వరి పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా జరిగే అనర్ధాలు గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కిరణ్మయి రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

చిన్నారులకు ఆశీర్వచనాలు.

చిన్నారులకు ఆశీర్వచనాలు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : మండల పరిధిలోని నాగలవంచ గ్రామానికి చెందిన కంభం నరేష్ – కృష్ణవేణి దంపతుల అక్షయ, మైత్రేయి చిన్నారులకు పలువురు ఆశీర్వచనాలు అందించారు. ఈ

Read More »

వెలుగు మట్ల బాధితులలో అర్హులకు అండగా ఉంటాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి

Read More »

భూధాన భూములలోనే పేదలకు పక్కా ఇళ్ళు కట్టించాలి!

భూధాన భూములలోనే పేదలకు పక్కా ఇళ్ళు కట్టించాలి! పోతినేని సుదర్శన్ రావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు- డిమాండ్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం పట్టణంలో ప్రభుత్వం కూల్చి వేసిన

Read More »

సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చడం దారుణం

నాగర్ కర్నూల్ లో కుల వివక్షతకు పసిపాప బలి* *అమానుషం** నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఇందిరమ్మ రాజ్యమని , పేదల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగుమట్లలో సమయం ఇవ్వకుండా తెల్లవారుజామునే

Read More »

 Don't Miss this News !