+91 95819 05907

ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ అంగీకారం

నేటి గద్ధర్ వెబ్ డెస్క్:

హైదరాబాద్‌, మే16 ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్‌కు షెడ్యూల్‌ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎంను కలిసి పాఠశాలల పునః ప్రారంభానికి ముందే విద్యారంగ సమస్యలు పరిషరించాలని కోరామని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సీఎం ఫోన్‌ ద్వారా ఆదేశించారని తెలిపారు.
తర్వాత సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి చర్చించినట్టు తెలిపారు. తమ ప్రతిపాదనలకు కార్యదర్శి అంగీకారం తెలిపారని, ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని బదిలీ అయి రిలీవ్‌ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. సీఎం సూచన మేరకు సబంధిత శాఖల అధికారులతో చర్చిస్తానని తెలిపారని పేర్కొన్నారు. ఢిల్లీ మాడల్‌ను తెలంగాణలో అమలు జరపాలన్న తమ వినతి మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలను పాఠశాలల సందర్శనకు ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచన ఉందని తెలిపారని పేర్కొన్నారు. సమావేశంలో యూఎస్పీసీ, జాక్టో నాయకులు కే జంగయ్య, వై అశోక్‌ కుమార్‌, టీ లింగారెడ్డి, సదానందంగౌడ్‌ పాల్గొన్నారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులపై చర్య తీసుకోవాలి: పీఆర్‌టీయూటీఎస్‌

టెట్‌ విషయంలో సరైన సమాచారాన్ని అందించకుండా ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూటీఎస్‌ డిమాండ్‌ చేసింది. కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా ఉపాధ్యాయ సమస్యలను పట్టించుకోకుండా పలు అక్రమాలకు పాల్పడిన వీరిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం విద్యాశాఖ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆ సంఘం నేతలు కోరారు. గతంలో నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !