+91 95819 05907

ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ అంగీకారం

నేటి గద్ధర్ వెబ్ డెస్క్:

హైదరాబాద్‌, మే16 ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి రిలీవ్‌కు షెడ్యూల్‌ విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎంను కలిసి పాఠశాలల పునః ప్రారంభానికి ముందే విద్యారంగ సమస్యలు పరిషరించాలని కోరామని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సీఎం ఫోన్‌ ద్వారా ఆదేశించారని తెలిపారు.
తర్వాత సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంను కలిసి చర్చించినట్టు తెలిపారు. తమ ప్రతిపాదనలకు కార్యదర్శి అంగీకారం తెలిపారని, ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని బదిలీ అయి రిలీవ్‌ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేస్తామన్నారని తెలిపారు. సీఎం సూచన మేరకు సబంధిత శాఖల అధికారులతో చర్చిస్తానని తెలిపారని పేర్కొన్నారు. ఢిల్లీ మాడల్‌ను తెలంగాణలో అమలు జరపాలన్న తమ వినతి మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలను పాఠశాలల సందర్శనకు ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచన ఉందని తెలిపారని పేర్కొన్నారు. సమావేశంలో యూఎస్పీసీ, జాక్టో నాయకులు కే జంగయ్య, వై అశోక్‌ కుమార్‌, టీ లింగారెడ్డి, సదానందంగౌడ్‌ పాల్గొన్నారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులపై చర్య తీసుకోవాలి: పీఆర్‌టీయూటీఎస్‌

టెట్‌ విషయంలో సరైన సమాచారాన్ని అందించకుండా ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేసిన పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూటీఎస్‌ డిమాండ్‌ చేసింది. కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా ఉపాధ్యాయ సమస్యలను పట్టించుకోకుండా పలు అక్రమాలకు పాల్పడిన వీరిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం విద్యాశాఖ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆ సంఘం నేతలు కోరారు. గతంలో నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !