★పురుగుల అన్నం…చాలి చాలని కూరలు… నీళ్ల పెరుగు
★300 మంది విద్యార్థుల ఆకలి కేకలను ఆధారాలతో ప్రచురించిన నేటి గద్ధర్ న్యూస్ (www. neti gadar news. com)
★ విద్యార్థులకు అండగా పోరాడిన PDSU
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:పురుగుల అన్నం…చాలి చాలని కూరలు… నీళ్ల పెరుగు అనే శీర్షిక మే 9 న నేటి గద్దర్ న్యూస్ లో అశ్వాపురం మండలం మిట్టగూడెం గురుకులం బాయ్స్ డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థుల ఆకలి బాధలను ప్రచురించిన నేటి గద్దర్ ఐటెం రాష్ట్రం, జిల్లా వ్యాప్తంగా చర్చాంసనీయంగా మారింది. ఈనెల 10న PDSU సైతం మిట్ట గూడెం గురుకులం బాయ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు. PDSU విద్యార్థి సంఘం సైతం విద్యార్థులకు మద్దతుగా పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుండి గురువారం సాయంత్రం ఆ కళాశాల ప్రిన్సిపల్ జీ. స్వప్న కుమారిని బాధ్యురాల్ చేస్తూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది.









