+91 95819 05907

ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డి….నల్గొండ నయీమ్ తీన్మార్ మల్లన్న:రేగా కాంతారావు

★BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
★వివాద రహితుడు…ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి:రేగా
★మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో లో BRS mlcఅభ్యర్థి విజయం కాంక్షిస్తూ సమావేశం
★హాజరైన ఏడు మండలాల BRS ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, వివాద రహితుడు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం మణుగూరు మండలం బండారి గూడెం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పినపాక నియోజకవర్గ BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం BRS పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అధ్యక్షత నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు mlc అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కు ఆ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాకేష్ రెడ్డి ని శాసన మండల కి పంపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతారని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ని తప్పక కలిసి రాకేష్ రెడ్డి మూడవ నెంబర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ శ్రేణులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు
🔥🔥🔥🔥🔥🔥🔥
బ్లాక్ మెలర్, నల్లగొండ నయీమ్ తీన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్పాలి:రేగా

నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బ్లాక్ మెయిలర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను తనను గెలిపించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి నీ శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

★తీన్మార్ మల్లన్న నాపై చేసిన భూకబ్జా ఆరోపణలు బేసరత్తుగా ఉపసంహరించుకోవాలి:రేగా

తీన్మార్ మల్లన్న తనపై గతంలో చేసిన భూకబ్జా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మణుగూరు కి వస్తే తను కబ్జా చేసిన భూమి ఎక్కడ ఉందో విలేకరుల సమక్షంలో నిరూపించాలని అన్నారు. గిరిజన నాయకుడినైనా తనపై హైదరాబాద్ పినపాకలో భూకబ్జాలకు పాల్పడినట్లు అసత్య ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న నిరూపిస్తావా అని సవాల్ విసిరారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్ ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొని విద్యావంతులు తప్పు చేయొద్దని కోరారు.
★Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఘన సన్మానం.
నల్లగొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని మణుగూరు BRS భవన్ లో రాజ్యసభ ఎంపీ రవిచంద్ర,బీ. ఆర్.ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ లో శాలువా తో ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గం లోని ఏడు మండలాల బీ.ఆర్.ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !