+91 95819 05907

ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డి….నల్గొండ నయీమ్ తీన్మార్ మల్లన్న:రేగా కాంతారావు

★BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
★వివాద రహితుడు…ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి:రేగా
★మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో లో BRS mlcఅభ్యర్థి విజయం కాంక్షిస్తూ సమావేశం
★హాజరైన ఏడు మండలాల BRS ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, వివాద రహితుడు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం మణుగూరు మండలం బండారి గూడెం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పినపాక నియోజకవర్గ BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం BRS పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అధ్యక్షత నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు mlc అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కు ఆ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాకేష్ రెడ్డి ని శాసన మండల కి పంపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతారని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ని తప్పక కలిసి రాకేష్ రెడ్డి మూడవ నెంబర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ శ్రేణులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు
🔥🔥🔥🔥🔥🔥🔥
బ్లాక్ మెలర్, నల్లగొండ నయీమ్ తీన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్పాలి:రేగా

నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బ్లాక్ మెయిలర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను తనను గెలిపించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి నీ శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

★తీన్మార్ మల్లన్న నాపై చేసిన భూకబ్జా ఆరోపణలు బేసరత్తుగా ఉపసంహరించుకోవాలి:రేగా

తీన్మార్ మల్లన్న తనపై గతంలో చేసిన భూకబ్జా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మణుగూరు కి వస్తే తను కబ్జా చేసిన భూమి ఎక్కడ ఉందో విలేకరుల సమక్షంలో నిరూపించాలని అన్నారు. గిరిజన నాయకుడినైనా తనపై హైదరాబాద్ పినపాకలో భూకబ్జాలకు పాల్పడినట్లు అసత్య ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న నిరూపిస్తావా అని సవాల్ విసిరారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్ ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొని విద్యావంతులు తప్పు చేయొద్దని కోరారు.
★Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఘన సన్మానం.
నల్లగొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని మణుగూరు BRS భవన్ లో రాజ్యసభ ఎంపీ రవిచంద్ర,బీ. ఆర్.ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ లో శాలువా తో ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గం లోని ఏడు మండలాల బీ.ఆర్.ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !