★BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
★వివాద రహితుడు…ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి:రేగా
★మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో లో BRS mlcఅభ్యర్థి విజయం కాంక్షిస్తూ సమావేశం
★హాజరైన ఏడు మండలాల BRS ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు
నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, వివాద రహితుడు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం మణుగూరు మండలం బండారి గూడెం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పినపాక నియోజకవర్గ BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం BRS పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అధ్యక్షత నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు mlc అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కు ఆ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాకేష్ రెడ్డి ని శాసన మండల కి పంపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతారని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ని తప్పక కలిసి రాకేష్ రెడ్డి మూడవ నెంబర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ శ్రేణులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు
🔥🔥🔥🔥🔥🔥🔥
బ్లాక్ మెలర్, నల్లగొండ నయీమ్ తీన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్పాలి:రేగా
నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బ్లాక్ మెయిలర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను తనను గెలిపించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి నీ శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
★తీన్మార్ మల్లన్న నాపై చేసిన భూకబ్జా ఆరోపణలు బేసరత్తుగా ఉపసంహరించుకోవాలి:రేగా
తీన్మార్ మల్లన్న తనపై గతంలో చేసిన భూకబ్జా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మణుగూరు కి వస్తే తను కబ్జా చేసిన భూమి ఎక్కడ ఉందో విలేకరుల సమక్షంలో నిరూపించాలని అన్నారు. గిరిజన నాయకుడినైనా తనపై హైదరాబాద్ పినపాకలో భూకబ్జాలకు పాల్పడినట్లు అసత్య ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న నిరూపిస్తావా అని సవాల్ విసిరారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్ ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొని విద్యావంతులు తప్పు చేయొద్దని కోరారు.
★Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఘన సన్మానం.
నల్లగొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని మణుగూరు BRS భవన్ లో రాజ్యసభ ఎంపీ రవిచంద్ర,బీ. ఆర్.ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ లో శాలువా తో ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గం లోని ఏడు మండలాల బీ.ఆర్.ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.