+91 95819 05907

ఉన్నత విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డి….నల్గొండ నయీమ్ తీన్మార్ మల్లన్న:రేగా కాంతారావు

★BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
★వివాద రహితుడు…ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి:రేగా
★మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో లో BRS mlcఅభ్యర్థి విజయం కాంక్షిస్తూ సమావేశం
★హాజరైన ఏడు మండలాల BRS ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:BRS నల్గొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, వివాద రహితుడు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.శుక్రవారం మణుగూరు మండలం బండారి గూడెం కిన్నెర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పినపాక నియోజకవర్గ BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం BRS పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అధ్యక్షత నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు mlc అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కు ఆ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాకేష్ రెడ్డి ని శాసన మండల కి పంపిస్తే ప్రశ్నించే గొంతుక అవుతారని అన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ని తప్పక కలిసి రాకేష్ రెడ్డి మూడవ నెంబర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ శ్రేణులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు
🔥🔥🔥🔥🔥🔥🔥
బ్లాక్ మెలర్, నల్లగొండ నయీమ్ తీన్మార్ మల్లన్నకు బుద్ధి చెప్పాలి:రేగా

నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బ్లాక్ మెయిలర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను తనను గెలిపించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తన దగ్గర సమాచారం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి నీ శాసనమండలికి పంపిస్తే నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

★తీన్మార్ మల్లన్న నాపై చేసిన భూకబ్జా ఆరోపణలు బేసరత్తుగా ఉపసంహరించుకోవాలి:రేగా

తీన్మార్ మల్లన్న తనపై గతంలో చేసిన భూకబ్జా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మణుగూరు కి వస్తే తను కబ్జా చేసిన భూమి ఎక్కడ ఉందో విలేకరుల సమక్షంలో నిరూపించాలని అన్నారు. గిరిజన నాయకుడినైనా తనపై హైదరాబాద్ పినపాకలో భూకబ్జాలకు పాల్పడినట్లు అసత్య ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న నిరూపిస్తావా అని సవాల్ విసిరారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్ ని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకొని విద్యావంతులు తప్పు చేయొద్దని కోరారు.
★Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి ఘన సన్మానం.
నల్లగొండ Mlc అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని మణుగూరు BRS భవన్ లో రాజ్యసభ ఎంపీ రవిచంద్ర,బీ. ఆర్.ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ,ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ లో శాలువా తో ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గం లోని ఏడు మండలాల బీ.ఆర్.ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !