+91 95819 05907

బాల వెలుగు పాఠశాలకు.రూ. 10 వేలు,ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి 50 కేజీల బియ్యం వితరణలు

లైన్స్ క్లబ్

చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా

సామాజిక సేవా కార్యక్రమాలు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి , మణుగూరు (మే 19):

లయన్స్ క్లబ్ మణుగూరు వారి ఆధ్వర్యంలో చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవాన్ని సుందరయ్య నగర్ లో సామాజిక సేవా కార్యక్రమాల తో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు సభ్యులు మరియు వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ సభ్యులు పుర ప్రముఖులు,డాక్టర్లు హరిబాబు భానుమతి దంపతులను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించి,45వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాల వెలుగు పాఠశాలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి అరకింట బియ్యం మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ లు మాట్లాడుతూ,సేవా గురువు, మానవతావాది పిల్లారి శెట్టి హరిబాబు వివాహ వార్షికోత్సవంలో కేవలం సెలబ్రేషన్స్ లే కాకుండా సామాజిక బాధ్యత,సేవా దృక్పథంతో వీధి బాలల పాఠశాల బాల వెలుగుకు, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి వితరణలు అందించి పలువురికి సేవ స్ఫూర్తినిచ్చి,ఆదర్శం అయ్యారని అన్నారు.మనం సంతోషంగా జరుపుకునే వేడుకలలో ఆ పన్నులకు సహాయం అందించడం సరికొత్త మానవీయ సంస్కృతి అన్నారు.లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పుర ప్రముఖులకు లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.పిల్లారి శెట్టి హరిబాబు- భానుమతి దంపతులు 45 ఏళ్ల క్రితం నాటి తమ వివాహ తీపి గుర్తులను నెమరు వేసుకుని ఎంతో ఆనందపడ్డారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు,సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్,జోన్ చైర్పర్సన్ డెసిగ్నేట్,భూక్య ప్రసాద్,కముజు చంద్రమోహన్, డాక్టర్ దుస్సా సమ్మయ్య,ఎం నాగేశ్వరరావు,దోసపాటి వెంకటేశ్వరరావు,దుగ్గి సతీష్ కుమార్,డాక్టర్ శశిధర్ బాలకృష్ణ, శ్రీను,వాసవి క్లబ్ నుండి కడవెండి విశ్వనాథ గుప్తా,బండారు నరసింహారావు,చిత్తలూరి రమేష్ బొగ్గవరపు అంజలి,మురారి,పుర ప్రముఖులు దొబ్బల వెంకటప్పయ్య,వెంకట్,రవి మరియు కుటుంబ సభ్యులు ప్రదీప్,డాక్టర్ కోలా కృష్ణమోహన్ -ప్రణతి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు రెండవ విడతలో 2,26,417 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం కలెక్టరేట్ లోని

Read More »

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు..

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు.. * మంత్రి తుమ్మల కృషితో రూ.249 మంజూరు * రూ.90 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ నిర్మాణం మరియు రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం *

Read More »

కిలారు మనోహర్ కు సన్మానం.

కిలారు మనోహర్ కు సన్మానం. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: మండల కేంద్రం చింతకాని నూతన సర్పంచిగా ఎన్నికైన కిలారుమనోహర్ విజయోత్సవ సభలో పలువురు కిలారు మనోహర్ ను సన్మానించారు. కార్యక్రమంలో దిశ

Read More »

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ 105 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు ★★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు

అగపేట సర్పంచ్ గా కొత్త యాకన్న గౌడ్ భారీ మెజార్టీతో గెలుపు ★ 7 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ★తమ్ముడు సర్పంచ్, అక్క వార్డు మెంబర్ గా గెలుపు నేటి గదర్:దంతాలపల్లి

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥💥💥…. ముదిగొండలో ఎన్నికల్లో ఉద్రిక్తత… నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ముదిగొండలో పంచాయతీ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్

Read More »

 Don't Miss this News !