+91 95819 05907

బాల వెలుగు పాఠశాలకు.రూ. 10 వేలు,ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి 50 కేజీల బియ్యం వితరణలు

లైన్స్ క్లబ్

చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా

సామాజిక సేవా కార్యక్రమాలు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి , మణుగూరు (మే 19):

లయన్స్ క్లబ్ మణుగూరు వారి ఆధ్వర్యంలో చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవాన్ని సుందరయ్య నగర్ లో సామాజిక సేవా కార్యక్రమాల తో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు సభ్యులు మరియు వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ సభ్యులు పుర ప్రముఖులు,డాక్టర్లు హరిబాబు భానుమతి దంపతులను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించి,45వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాల వెలుగు పాఠశాలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి అరకింట బియ్యం మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ లు మాట్లాడుతూ,సేవా గురువు, మానవతావాది పిల్లారి శెట్టి హరిబాబు వివాహ వార్షికోత్సవంలో కేవలం సెలబ్రేషన్స్ లే కాకుండా సామాజిక బాధ్యత,సేవా దృక్పథంతో వీధి బాలల పాఠశాల బాల వెలుగుకు, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి వితరణలు అందించి పలువురికి సేవ స్ఫూర్తినిచ్చి,ఆదర్శం అయ్యారని అన్నారు.మనం సంతోషంగా జరుపుకునే వేడుకలలో ఆ పన్నులకు సహాయం అందించడం సరికొత్త మానవీయ సంస్కృతి అన్నారు.లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పుర ప్రముఖులకు లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.పిల్లారి శెట్టి హరిబాబు- భానుమతి దంపతులు 45 ఏళ్ల క్రితం నాటి తమ వివాహ తీపి గుర్తులను నెమరు వేసుకుని ఎంతో ఆనందపడ్డారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు,సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్,జోన్ చైర్పర్సన్ డెసిగ్నేట్,భూక్య ప్రసాద్,కముజు చంద్రమోహన్, డాక్టర్ దుస్సా సమ్మయ్య,ఎం నాగేశ్వరరావు,దోసపాటి వెంకటేశ్వరరావు,దుగ్గి సతీష్ కుమార్,డాక్టర్ శశిధర్ బాలకృష్ణ, శ్రీను,వాసవి క్లబ్ నుండి కడవెండి విశ్వనాథ గుప్తా,బండారు నరసింహారావు,చిత్తలూరి రమేష్ బొగ్గవరపు అంజలి,మురారి,పుర ప్రముఖులు దొబ్బల వెంకటప్పయ్య,వెంకట్,రవి మరియు కుటుంబ సభ్యులు ప్రదీప్,డాక్టర్ కోలా కృష్ణమోహన్ -ప్రణతి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !