+91 95819 05907

బాల వెలుగు పాఠశాలకు.రూ. 10 వేలు,ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి 50 కేజీల బియ్యం వితరణలు

లైన్స్ క్లబ్

చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా

సామాజిక సేవా కార్యక్రమాలు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి , మణుగూరు (మే 19):

లయన్స్ క్లబ్ మణుగూరు వారి ఆధ్వర్యంలో చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబు 45వ వివాహ వార్షికోత్సవాన్ని సుందరయ్య నగర్ లో సామాజిక సేవా కార్యక్రమాల తో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు సభ్యులు మరియు వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ సభ్యులు పుర ప్రముఖులు,డాక్టర్లు హరిబాబు భానుమతి దంపతులను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించి,45వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బాల వెలుగు పాఠశాలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి అరకింట బియ్యం మరియు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మణుగూరు ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ లు మాట్లాడుతూ,సేవా గురువు, మానవతావాది పిల్లారి శెట్టి హరిబాబు వివాహ వార్షికోత్సవంలో కేవలం సెలబ్రేషన్స్ లే కాకుండా సామాజిక బాధ్యత,సేవా దృక్పథంతో వీధి బాలల పాఠశాల బాల వెలుగుకు, అశ్వాపురంలోని ఆరిఫా రోషిని వృద్ధాశ్రమానికి వితరణలు అందించి పలువురికి సేవ స్ఫూర్తినిచ్చి,ఆదర్శం అయ్యారని అన్నారు.మనం సంతోషంగా జరుపుకునే వేడుకలలో ఆ పన్నులకు సహాయం అందించడం సరికొత్త మానవీయ సంస్కృతి అన్నారు.లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పుర ప్రముఖులకు లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.పిల్లారి శెట్టి హరిబాబు- భానుమతి దంపతులు 45 ఏళ్ల క్రితం నాటి తమ వివాహ తీపి గుర్తులను నెమరు వేసుకుని ఎంతో ఆనందపడ్డారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు,సెక్రటరీ డాక్టర్ షేక్ మీరా హుస్సేన్,జోన్ చైర్పర్సన్ డెసిగ్నేట్,భూక్య ప్రసాద్,కముజు చంద్రమోహన్, డాక్టర్ దుస్సా సమ్మయ్య,ఎం నాగేశ్వరరావు,దోసపాటి వెంకటేశ్వరరావు,దుగ్గి సతీష్ కుమార్,డాక్టర్ శశిధర్ బాలకృష్ణ, శ్రీను,వాసవి క్లబ్ నుండి కడవెండి విశ్వనాథ గుప్తా,బండారు నరసింహారావు,చిత్తలూరి రమేష్ బొగ్గవరపు అంజలి,మురారి,పుర ప్రముఖులు దొబ్బల వెంకటప్పయ్య,వెంకట్,రవి మరియు కుటుంబ సభ్యులు ప్రదీప్,డాక్టర్ కోలా కృష్ణమోహన్ -ప్రణతి,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !