+91 95819 05907

తీన్మార్ మల్లన్న గెలిపిస్తే సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి

ఉమ్మడి ఖమ్మం -వరంగల్ -నల్గొండ పట్టభద్రుల కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీ తో గెలిపించాలని

★కన్నాయిగూడెం మండల ప్రజలను కోరిన మండల అధ్యక్షులు – అప్సర్ పాషా

నేటి గద్దర్ న్యూస్,ములుగు/ కన్నాయిగూడెం:(మే 19).

మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ సూచనల మేరకు కన్నాయిగూడెం మండల పట్టా భద్రులను మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని కన్నాయిగూడెం మండల్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా కోరారు.కన్నాయిగూడెం మండల కేంద్రంలో మండల కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథి మండల అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా హాజరై మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని గెలిపించాలని చదువుకున్న యువతను కోరారు.ఈ సందర్భముగా మండల్ అధ్యక్షులు అప్సర్ పాషా మాట్లాడుతూ గత పదేండ్ల పాలనలో దొరల అహంకారం, అక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిందని, యావత్తు తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తే, బి.ఆర్.ఎస్.పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తులను కొల్లగొట్టి, విద్య, ఉద్యోగాలు లేకుండా యువతను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఐదు నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత పద్ధతిలో ఎంపిక చేసింది, మెగా డిఎస్సీ వేసింది, ములుగులో వైద్య కళాశాల ప్రారంభం చేసి, వైద్య కళాశాల యందు అలాగే ఆరోగ్య శాఖా యందు కూడా ఉద్యోగ భర్తీ చేపట్టిందని అన్నారు. తీన్మార్ మల్లన్న గారు కూడా ప్రశ్నించే గొంతుక అని, గత ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అని, ప్రజల కష్టాలను, నష్టాలను అంచనా వేసిన వ్యక్తి కనుక ప్రతి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల్ జడ్పీటీసీ నామ కరం చందు, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అబ్బు రమేష్ మండల్ sc సెల్ అధ్యక్షులు సునార్కని రాంబాబు జిల్లా టీపీసీసీ మీడియా కో కో ఆర్డినేటర్ సునార్కని సాంబశివ కన్నాయిగూడెం టౌన్ అధ్యక్షులు మంగళరాపు సత్యం మండల్ యూత్ అధ్యక్షులు బోట నాగేష్ మండల్ కో ఆర్డినేటర్ దుర్గం ప్రభాకర్ మాజి ఎంపీటీసీ తడకల మధుకర్ మండల్ కాంగ్రేస్ నాయకులు చిదరీ సుమన్ మండల్ st సెల్ ఉపాధ్యక్షులు చేర్ప పగిడయ్య మల్లేష్ రాజబాబు యూత్ నాయకులు సత్యనారాయణ శ్రీధర్ బుద్దె నరేందర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !