+91 95819 05907

విత్తన డీలర్లకు ఎస్పీ సీరియస్ వార్నింగ్

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
– నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు
– జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

నేటి గదర్, మే 21, భద్రాద్రి కొత్తగూడెం :

రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులతో కలిసి సమన్వయం పాటిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తన దుకాణాలలో తనిఖీలు చేపట్టే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. రైతులకు మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నమ్మిస్తూ నకిలీ, కల్తీ విత్తనాలను సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని అరికట్టడంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తనాలు దుకాణాల యజమానులకు పలు సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, సమాచారం సేకరించి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లైసెన్స్ లు లేకుండా దుకాణాలను నడిపినా, రికార్థులను సరైన పద్దతిలో మెయింటైన్ చేయకపోయినా, నకిలీ విత్తనాలను విక్రయించినా యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాల జారీ చేయడం జరిగిందని తెలియజేసారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలు ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు రవాణా కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణాను, సరఫరాను అరికట్టడం జరిగుతుందని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

అశ్వారావుపేటలో 2.32 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 20: అశ్వారావుపేటలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ. 2.32 కోట్లు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అశ్వరావుపేట పోలీసులు. ముగ్గురు

Read More »

ఏప్రిల్ 20, 21 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి సత్తుపల్లి, భద్రాచలం పర్యటన

*ఏప్రిల్ 20 షెడ్యూల్* 4.00pm – RJC క్రిష్ణ గారి పరామర్ష, కాలువ ఒడ్డు, ఖమ్మం 4.30pm – గట్టు కరుణ గారి కుమారుడి రిసెప్షన్ (గ్రాండ్ గాయత్రి హోటల్, వైరా రోడ్డు, ఖమ్మం)

Read More »

 Don't Miss this News !