+91 95819 05907

విత్తన డీలర్లకు ఎస్పీ సీరియస్ వార్నింగ్

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
– నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు
– జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

నేటి గదర్, మే 21, భద్రాద్రి కొత్తగూడెం :

రైతులు నకిలీ విత్తనాల ముఠాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులతో కలిసి సమన్వయం పాటిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తన దుకాణాలలో తనిఖీలు చేపట్టే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. రైతులకు మేలు రకం విత్తనాలు విక్రయించే విధంగా నమ్మిస్తూ నకిలీ, కల్తీ విత్తనాలను సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని అరికట్టడంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విత్తనాలు దుకాణాల యజమానులకు పలు సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, సమాచారం సేకరించి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లైసెన్స్ లు లేకుండా దుకాణాలను నడిపినా, రికార్థులను సరైన పద్దతిలో మెయింటైన్ చేయకపోయినా, నకిలీ విత్తనాలను విక్రయించినా యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాల జారీ చేయడం జరిగిందని తెలియజేసారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలు ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు రవాణా కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణాను, సరఫరాను అరికట్టడం జరిగుతుందని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !