+91 95819 05907

తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీ తో గెలిపించాలి

  – డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

 నేటి గదర్, మే 22, బోనకల్ ప్రతినిధి :

ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ శ్రేణులు సమన్వయ సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ గాలి దుర్గారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రులకు కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసమర్థత వలన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. పట్టభద్రులను పల్లా మోసం చేశాడని ఆక్షేపించారు. తీన్మార్ మల్లన్న ను గెలిపించి పట్ట భద్రులు తమకు అండగా తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మద్దతు ప్రకటించిన నిరుద్యోగుల ఆశాకిరణం తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య పట్లైనా అవగాహన కలిగి నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సముచిత న్యాయం చేసే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న ను మండలికి పంపితే అన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సమాజంలో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ నాయకులు జావీద్, టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, డిసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరావు, సిపిఎం సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శిదొండపాటి నాగేశ్వరరావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆకెన పవన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, భూక్య సైదా నాయక్, బండి వెంకటేశ్వర్లు, బిపి నాయక్, భూక్య భద్రు నాయక్, పల్లిపాటి తిరుపతిరావు,అంతోటి వెంకటేశ్వర్లు, భాగం పాపారావు, చేబ్రోలు వెంకటేశ్వర్లు, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !