+91 95819 05907

తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీ తో గెలిపించాలి

  – డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

 నేటి గదర్, మే 22, బోనకల్ ప్రతినిధి :

ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ శ్రేణులు సమన్వయ సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ గాలి దుర్గారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రులకు కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసమర్థత వలన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. పట్టభద్రులను పల్లా మోసం చేశాడని ఆక్షేపించారు. తీన్మార్ మల్లన్న ను గెలిపించి పట్ట భద్రులు తమకు అండగా తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మద్దతు ప్రకటించిన నిరుద్యోగుల ఆశాకిరణం తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య పట్లైనా అవగాహన కలిగి నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సముచిత న్యాయం చేసే ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న ను మండలికి పంపితే అన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సమాజంలో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ నాయకులు జావీద్, టీపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, డిసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరావు, సిపిఎం సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శిదొండపాటి నాగేశ్వరరావు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆకెన పవన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, భూక్య సైదా నాయక్, బండి వెంకటేశ్వర్లు, బిపి నాయక్, భూక్య భద్రు నాయక్, పల్లిపాటి తిరుపతిరావు,అంతోటి వెంకటేశ్వర్లు, భాగం పాపారావు, చేబ్రోలు వెంకటేశ్వర్లు, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !