+91 95819 05907

చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

రైతులు ఆందోళన చెంది ధాన్యం అమ్మకం చేయవద్దు చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

నేటి గదర్ న్యూస్, మే 22, ములుగు ప్రతినిధి:

జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు ఆందోళన చెంది తక్కువ ధరకు ధాన్యం అమ్మకం చేసుకోవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) సి.హెచ్. మహేందర్ జి, ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి లతో కలిసి కలెక్టరు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 50వేల 175 ఎకరాలలో ఒక లక్ష 4,775 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్నారని, రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇప్పటికే జిల్లాలో ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అకాల వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరి ధాన్యం తడవగా ఆ ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారని అన్నారు. కొందరు రైతులు కంగారుపడి రైస్ మిల్లర్లకు తక్కువ ధరకే అమ్మకం చేసుకుంటున్నారని విషయం గ్రహించామని, రైతులు ఎవరు వరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకం చేసుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా ఇప్పటికే వాజేడు మండలం వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు ఫ్లయింగ్ స్కాడ్స్ నిత్యం పర్యటిస్తున్నారని మండల స్థాయిలో ఎమ్మార్వో ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ నెల 19న కురిసిన అకాల వర్షం కారణంగా 7000 మెట్రి క్ టన్నుల వరి ధాన్యం తడిసిందని, తడిసిన 7 వేల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాటిని నమ్మవద్దని రైతులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు గురైన 9347416178 అనే హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి వివరించవచ్చని, హెల్ప్ లైన్ వారం రోజులలో 24 గంటల పాటు పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేయడానికి సంబంధిత అధికారులతో కృషి చేస్తున్నామని, మొలకెత్తిన వరి ధాన్యంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ బి. రాంపతి, డి సి ఓ సర్దార్ సింగ్, డి పి ఆర్ ఓ ఎండీ రఫిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !