+91 95819 05907

ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు విక్రయించాలి

లైసెన్స్ ,ధరల పట్టిలను, స్టాక్ బోర్డును తప్పక ప్రదర్శించాలి..

ఏడిఏ విజయచంద్ర

నేటి గదర్, మే 23 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

కూసుమంచి గ్రామ పరిధిలోని రైతు వేదిక నందు పురుగుమందుల ,ఎరువుల విత్తన వ్యాపారులతో ఏడిఏ విజయచంద్ర మండల వ్యవసాయ అధికారి వాణి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ విజయచంద్ర మాట్లాడుతూ… డీలర్లు అందరూ విత్తన చట్టం పురుగు మందుల చట్టం, ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని సూచించారు. ప్రతి ఒక్క షాపులో తప్పనిసరిగా లైసెన్సులను కనపడేలా పెట్టాలని, స్టాప్ బోర్డు, ధరల పట్టికను ప్రదర్శించాలని, స్టాక్ బుక్ లను విధిగా రోజువారీగా అప్డేట్ చేయాలని, లైసెన్స్ నందు పిసిలు ఓ ఫామ్ లు జతపరచుకోవాలని సూచించారు. పివోఎస్ మెషిన్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ సరితూగాలని సూచించారు. ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినట్లు సమాచారం వస్తే వారిపై సంబంధిత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలకు సంబంధించి జిఓటి రిపోర్ట్స్ విత్తన తయారీదారు యొక్క లైసెన్స్, సోర్స్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు. విత్తనాలకు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించరాదని ఎక్కడైనా అటువంటి ఫిర్యాదు వస్తే వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. గ్రామాలలో ఎక్కడైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వ్యవసాయ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పురుగుమందుల, ఎరువుల విత్తన డీలర్లు, ఏఈవోలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ విఎస్టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం

Read More »

డైమండ్ చెస్ అకాడమీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- సైనిక్ పురిలో డైమండ్ చెస్ అకాడమీనీ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ప్రారంభించారు.అంతర్జాతీయ చెస్ క్రీడాకారులైనటువంటి దివ్య

Read More »

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

 Don't Miss this News !