+91 95819 05907

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి: పోరిక గోవింద్ నాయక్

★ లేని పక్షంలో రైతులందరితో కలిసి ఉద్యమించడం జరుగుతుంది

నేటి గద్ధర్ న్యూస్,ములుగు ప్రతినిధి:

ములుగు మండలం బరిగానోల పల్లి గ్రామంలో శుక్రవారం MLC ఉప ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరుగుప్రయణంలో ములుగు వస్తున్న పోరిక గోవింద్ నాయక్ మార్గమధ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆగి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు . అతని దగ్గరికి వచ్చిన రైతులు తమగోడు వెల్లబోసుకున్నారు.
అధికారులు తమ పంటని కొనుగోలు చేయడం లేదని,అదేంటి అని ప్రశ్నిస్తే తేమ శాతం ఉందని సాకుగా చూపుతున్నారని కొనుగోలు చేస్తున్న వడ్లలో కూడా తరుగు తీస్తున్నారని తెలిపారు.
అసలే యాసంగి పంట ఎన్నో వ్యయ ప్రయసలు పడి పండిచి ఇక్కడికి తీసుకొస్తే ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గోవింద్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు రైతుల జీవనానికి గొడ్డలి పెట్టు అని ఈపద్దతి అవలంబిస్తే మున్ముందు రైతులనుండి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోవలసి వస్తుంది అని హెచ్చరించారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దారుణమైన విషయం అని అన్నారు. సకాలంలో రైతు బంధు వేయకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందే కాకుండా ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు.
ఎప్పుడు వర్షం వస్తుందో వర్షం వస్తే తమ పంట నాశనం ఐపోద్ది అనే ఆవేదనతో రైతులందరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అని ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రతి గింజను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే రైతుల ఉసురు ప్రభుత్వానికి తకుద్ధి అని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు.

వెంటనే తరుగు లేకుండా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతులందరితో కలిసి ఉద్యమించడం జరుగుతుందని ప్రభుత్వానికి తన హెచ్చరికను తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాలెపు శ్రీను,గ్రామ అధ్యక్షుడు లత నర్శింగా రావు నాయకులు వీరాబోయిన రాజేందర్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !