+91 95819 05907

ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ 27వ వర్ధంతి.

◆ కామ్రేడ్ నల్లమల్ల ఆశయ సాధన కోసం ముందుకు సాగాలి.

నేటి గదర్, మే 24, ములుగు ప్రతినిధి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిపిఐ డిప్యూటీ ప్రధానకార్యదర్శి రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ 27వ వర్ధంతిని మణుగూరు సిపిఐ పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నల్లమల గిరి ప్రసాద్ ఫోటోకు సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఎస్కే సర్వర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ, సిపిఐమండల కార్యదర్శి జంగం మోహన్ రావు, పట్టణ కార్యదర్శి దుర్ఘ్యాల సుధాకర్ లు నివాళులు అర్పించి.మాట్లాడు తూ ఆనాడు పేద ప్రజల కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి, గిరిజన దళిత, బడుగు ,బలహీన వర్గాల పేద ప్రజల కోసం అహర్నిశలు పాటుపడి ,తెలంగాణ సాయుధ పోరాటం నడిపి తుపాకీ గుండ్లు సైతం తమ ఒంట్లో దిగిన మొక్కవోని ధైర్యంతో తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం చివర వరకు పోరాటం కొనసాగించిన మహా గొప్ప వ్యక్తి నల్లమల గిరిప్రసాద్ అని, 1978లో భూ పోరాటాలు కొనసాగించి వేలాదిమంది జైల్లో గడిపి, చివరకు ఆయన అనుకున్న పేదలకు వేలాది ఎకరాలు భూమిని పంచిన చరిత్ర సిపిఐ పార్టీనలమల గిరిప్రసాద్ దేని అన్నారు.. సిపిఐ డిప్యూటీ ప్రధానకార్యదర్శిగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగి పేద ప్రజల కోసం వారి హక్కుల కోసం ,అనేక పోరాటాలు కొనసాగించారు. అలాంటి త్యాగదనులు పోరాటాలు మహనీయులను ఆదర్శంగా తీసుకొని యువత ,భవిష్యత్తు తరాలకు బాటలు వేయాలని, వారి ఆశయాలు కొనసాగించాలని ,వారు అన్నారు.*ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పుట్టినటువంటి నల్లమల గిరిప్రసాద్ పోరాటాలకు పురిటిగడ్డగా ఎర్ర జెండాకు అడ్డాగా నేటికీ పిలవబడుతుందని వారు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జక్కుల రాజబాబు అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ మణుగూరు మండల అధ్యక్ష కార్యదర్శులు రాయల భిక్షం జి వెంకటేశ్వర్లు కోశాధికారి కొత్తపల్లి సీతారాములు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగరాజు, కార్యవర్గ సభ్యులు కన్నెబోయిన ప్రసాద్, శ్రీకాకుళం వీరమల్లు, sd .ఉమర్, బోశెట్టి సంపత్, రాజమౌళి, భీమా తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !