◆ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నేటి గద్ధర్ న్యూస్,ములుగు:
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు లో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
ములుగు జిల్లా పరిదిలో శాంతి కాపాడటం కోసం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలను నివారించడానికి , ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించడం కోసం , వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల దృష్ట్యా ఈ నెల 25 సాయంత్రం 4.00 గంటల నుండి 27.05.2024 సాయంత్రం 4.00 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఐదుగురు (5) కంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాన్ని నిషేధించడం జరిగిందని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయం లో చట్టవిరుద్ధమైన సమావేశాలపై పూర్తి నిషేధం మరియు బహిరంగ సభల నిర్వహణపై నిషేధం ఉంటుంది అని పేర్కొన్నారు . ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు.