◆దొడ్డిదారిన ఎస్టీ భోగస్ సర్టిఫికెట్లు పొందుతున్న వలస గిరిజనేతరులు
◆ప్రతి దరఖాస్తుదారుడి ఎస్టి కేటగిరి ఇంటి పేరు వంశవృక్షం పై పూర్తి విచారణ జరపాలి
◆గోండ్వానా సంక్షేమ పరిషత్ చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్. పూనెం వరప్రసాద్
నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి (చర్ల):
చర్ల మండల వ్యాప్తంగా ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని గోండ్ వాన సంక్షేమ పరిషత్ చర్ల మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అన్నారు చర్ల మండలం శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం మొదలుకొని వాజేడు వరకు మరియు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టి బాగా సర్టిఫికెట్లు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని రెవెన్యూ కార్యాలలో ఉన్న అధికారులు ఆయా దరఖాస్తుదారుడు ఎస్టీ కేటగిరి ఇంటి పేరు వంశ వృక్షం పూర్తిస్థాయి విచారణ జరపకుండా చేతివాటం ప్రదర్శిస్తూ విచ్చలవిడిగా ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు బయటకు పోతున్నాయి అని ఆరోపించారు అసలైన కోయ సామాజిక వర్గానికి చెందినవారు వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేయడం చాలా వరకు తక్కువ కానీ ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లతో మాత్రం గిరిజనేతరులు దర్జాగా ఉద్యోగాలు అనుభవిస్తూ విలాసంగా జీవిస్తున్నారని ఆరోపించారు ఆంధ్ర ప్రాంతం నుండి బతుకుదెరువు కోసం ఏజెన్సీలోకి వలస వచ్చిన వివిధ గిరిజననేతర సామాజిక వర్గాల కులాలు ఆదివాసీ మహిళలను లోబరుచుకొని రెండో భార్య గా ఉంచుకొని ఆదివాసుల భూములు సైతం ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి బినామీ పేర్లతో ఆస్తులను కూడగట్టుకుని అనుభవిస్తున్నారని అలాగే గడిచిన రెండు దశాబ్దాలుగా ఎస్టి బోగస్ వల్లే సర్పంచులు ఎంపీపీలుగా కొనసాగుతున్నారని ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి అక్రమ ఆస్తులు కూడగడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 1950 సంవత్సరం రాష్ట్రపతి గెజిట్ ప్రకారంగానే ఏజెన్సీలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోరం ముత్యాలరావు సప్కా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు