+91 95819 05907

ఆ యువతి ప్రాణం ఖరీదు 25 లక్షలు?

 

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

జీవితంపై ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థిని ప్రాణానికి వెల కట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది.అసలు ఆరోజు ఏం జరిగింది..? పోలీస్ విచారణలో బయట పడిన నిజాలు ఏంటి..?అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం దొరకలేదు.
భద్రాచలం మారుతి పారా మెడికల్అండ్ నర్సింగ్ కళాశాలలో బి ఎస్ సి నర్సింగ్ ప్రధమ సంవత్సరం చదువుతూ, కళాశాల హాస్టల్లో తీవ్ర గాయాలు పాలై కారుణ్య అను విద్యార్థిని మృతి చెందిన సంగతి విధితమే.అయితే విద్యార్థిని మరణం మిస్టరీ ఇంకా వీడలేదు.గురువారం రాత్రి కారుణ్య మరణించింది. విద్యార్థిని ఎలా చనిపోయిందో తెలపాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ, కుటుంబ అభ్యులతో పాటు విద్యార్థి, దళిత సంఘాలు శుక్రవారం ఉదయం కళాశాల దగ్గర ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో కళాశాల చైర్మన్ డాక్టర్ కాంతారావుతోపాటు ఆయన కార్ డ్రైవర్ పై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 3.30 గంటల వరకూ ఆందోళన కొనసాగింది. కాగా కొందరు మధ్యవర్తులు కుటుంబ సభ్యులుతో చర్చలు నెరపి మృతురాలు కుటుంబానికి కళాశాల యాజమాన్యం రు.25 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.?

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ విఎస్టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం

Read More »

 Don't Miss this News !