నేటి గదర్, మే 25, ములుగు ప్రతినిధి:
వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి వివరంగా తెలియజేశారు. @ ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వాయిలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలి. @ ఓటరు ఓటు వేసేందుకు ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, లేదా 2,లేదా 3, 4 ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో పేర్కొనాల్సి @ మొదటి ప్రాధాన్యత ఓటు కింద 1 వ అంకెను, ఒక అభ్యర్థి కి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయవలసి ఉంటుందని
@ ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, బ్యాలెట్ పేపర్ లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1,2,3, వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. @ ఓటర్లు ఓటు వేసేటప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురుగా భారతీయ సంఖ్యలైన 1,2,3, మార్క్ చేయాలి. ఓటర్లు ఓటు వేసేటప్పుడు చేయకూడని అంశాలు
@ బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు 1 వ సంఖ్య ఇవ్వకూడదు.
@ బ్యాలెట్ పేపర్ పై సంతకం చేయడం, లేదా ఇనిషియల్ వేయటం, పేరు, అక్షరాలు వంటివి రాయకూడదు .
@ ఓటరు బ్యాలెట్ పేపర్ పై 1,2,3,4,5 సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలని,
@ ఓటరు బ్యాలెట్ పేపర్ పై పదాల రూపంలో, వన్, టూ, త్రీ అని ప్రాధాన్యత రాయకూడదు.
@. అలాగే బ్యాలెట్ పేపర్ పై రైట్ మార్క్ టిక్ చేయడం లేదా ఇంటు మార్కు పెట్టడం వంటివి సైతం చేయకూడదు.
@ ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వకూడదు. ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1,2 సంఖ్యలు వేయకూడదు .
@ బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో మాత్రమే 1,2,3, అంకెలు వేయాలి. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులకు వర్తించేలా నంబర్ మార్కు చేయకూడదు.