+91 95819 05907

నర్సింగ్ విద్యార్థిని మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి…

మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:

భద్రాచలం పట్టణంలోని మారుతి పారామెడికల్ నర్సింగ్ కళాశాలలో జరిగిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతి పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని,బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు డిమాండ్ చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,నర్సింగ్ కళాశాల
లో జరిగిన సంఘటన దారుణమన్నారు.విద్యార్ధి కారుణ్య మృతిపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.భద్రాచలం పట్టణంలో ఉన్న మారుతి
నర్సింగ్ కాలేజీలో విద్యార్థి మృతి సంఘటన అత్యంత దారుణమన్నారు.విద్యార్థి పగిడిపల్లి కారుణ్య బాత్రూంలో జారి పడి విద్యార్థి మరణించిందని,యాజమాన్యం చెప్పటం ఎన్నో అనుమానాలకు తావిస్తుందన్నారు.సీసీ కెమెరాలో మాత్రం బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయినట్లు ఉందని పేర్కొన్నారు.కళాశాల యాజమాన్యం మాత్రం విద్యార్థిని మరణాన్ని లెక్క లేని విధంగా వ్యవహరించి మాట్లాడటం దుర్మార్గమన్నారు.విద్యార్థిని మరణానికి కారణమైన నర్సింగ్ కళాశాలను తక్షణమే సంబంధిత అధికారులు సీజ్ చేయాలని, బాధిత విద్యార్థినీ కుటుంబానికి తగు న్యాయం చేయాలన్నారు. విద్యార్థి కారుణ్య మరణంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థి తల్లిదండ్రులకు తగిన న్యాయం చేయాలని,కాలేజీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో అన్ని సంఘాల నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !