ఎమ్మెల్యే రాందాస్ నాయక్
నేటి గద్దర్ న్యూస్
జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ
ఖమ్మం -వరంగల్ -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సిపిఐ , సిపిఎం , సిపిఐ ఎంఎల్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ శాసనమండలి అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికకు జూలూరుపాడు మండలంలోని ప్రతి గ్రామంలోనూ కష్టపడి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ , వైరా నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇంచార్జి భోర్ర రాజశేఖర్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ ఫ్యాక్స్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ , జూలూరుపాడు మండలంలో పట్టభద్రులు,
జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









