నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ మే 25:
దంతెలబోర క్రికెట్ మ్యాచ్ కి ముందు పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్నకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏడవల్లి కృష్ణ క్రీడాకారులను కోరారు.
క్రీడాకారులకు ద్వితీయ బహుమతిని ఎడవల్లి కృష్ణ
బహుకరించిన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం దంతెలబోర లో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి ప్రారంభించిన రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ అనంతరం టోర్నమెంట్ కి వచ్చిన పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్న కి ఓటు వేసి గెలిపించాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని,మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేది కేవలం మల్లన్న మాత్రమేనని అన్నారు. చదువుకున్న యువత ఆలోచన చేసి మల్లన్న కి అవకాశం ఇచ్చి శాసన మండలికి పంపించాలన్నారు.పోరాట యోధుడు,ఉద్యమ కారుడు,నిజాన్ని నిర్భయంగా మాట్లాడి,సామాన్య ప్రజలకు న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్లి మాట్లాడే దమ్మున్న నాయకుడు మన మల్లన్న,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేసే అందరికీ న్యాయం చేసే మన మల్లన్న సీరియల్ నంబర్ 2 పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ద్వితీయ బహుమతి బహుకరించిన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్,పాల్వంచ పట్టణ, మండల ఓబీసీ అద్యక్షులు బి.యన్ చారి,కట్ట సోమయ్య, యూత్ నాయకులు చింత నాగరాజు,సాంబయ్య,దేవి లాల్,ఇమాన్యుయల్,తదితరులు పాల్గొన్నారు.