+91 95819 05907

రేగుబల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ గుట్ట తవ్వకాలను రెవెన్యు వారు నిలిపివేయాలి: కొండా చరణ్

◆ ప్రజల అవసరాలకు తట్టెడు గ్రావెలుకు సైతం అనుమతి ఇవ్వని రెవెన్యు వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు

◆ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు తగ్గొడుతూ ఇసుక ర్యాంపులోకి రోడ్డు వెయ్యడం కోసం దొడ్డి దారిన గ్రావలను తరలిస్తున్న ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్లపై రెవెన్యూ వారికి ఎందుకు ఇంత ప్రేమ?

◆అనుమతులు లెకుండా గుట్ట తవ్వకాలు జరుపుతున్న (భారీ యంత్రాలైన) JCB ను తోలకాలు జరుపుతున్న లారీలను వెంటనే సీజ్ చెయ్యాలి

◆సంబంధిత అక్రమార్కులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలి లేకుంటే ఉద్యమిస్తాం

◆ CPIML మాస్ లైన్ ప్రజా పంధా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(దుమ్ముగూడెం):

దుమ్ముగూడెం మండలం లోని WL రేగుబల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ గుట్ట తవ్వకాలను రెవెన్యు వారు జోక్యం చేసుకొని నిలిపివేయాలని cpiml మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ ఆద్వర్యంలో దుమ్ముగూడెం మండల రెవెన్యూ కార్యాలయం అధికారికి RI ఆదినారాయణ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంధా) పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ రేగుపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ గుట్టని కొంతమంది ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలైన జెసిబి లతో తవ్వకాలు జరుపుతూ లారీలతో ఇసుక ర్యాంపు లోకి రోడ్డు వేయడానికి వంద లాది ట్రిప్పులు తోలుతున్నారు ఇప్పటికే నాలుగు రోజులుగా ఇది కొనసాగుతుంది ఇది ఇట్లాగే కొనసాగితే ఆ గ్రామం ప్రజలకు భవిష్యత్ లో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే గ్రామంలో ఉన్న పశువులు మేత కోసం, స్మశాన వాటిక కోసం కాల కాల క్రమేణా పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల స్థలాల కోసం తదితర అవసరాలకు ఈ గుట్టనే ఇక్కడి ప్రజలు వుపయోగిస్తారు కాబట్టి ప్రజల అవసరాలను, బలహీనతలను అడ్డం పెట్టుకొని ప్రజా సంపద అయిన గ్రావెల్ ను కొందరు లూఠీ చేస్తున్నారని అన్నారు గ్రామస్తులు అవసరాల కోసం తట్టెడు గ్రావెల్ తీసుకుపోయిన అడ్డుపడే రెవిన్యూ అధికారులకి ఇక్కడ జరుగుతున్న లూఠీ కనబడడం లేదా అని ప్రశ్నించారు గ్రావెల్ మట్టి ఇసుక ఒక్క ట్రక్కు సైతం అక్రమంగా తరలిస్తే ఆ వాహనాల పైన ఆ వ్యక్తుల పైన కేసులు పెట్టే రెవిన్యూ వారు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నారు అక్రమార్కుల పట్ల ఇసుక ర్యాంపు కాంట్రాక్టర్ల పట్ల రెవెన్యు వారు ఎందుకింత మెతక వైఖరి వహిస్తున్నారని విమర్శించారు తక్షణమే అనుమతులు లెకుండా జరుగుతున్న గుట్ట తవ్వకాలను,గ్రావెల్ అక్రమ రవాణా అని నిలిపివేయాలని, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించకుండా ఎగ్గొడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ గుట్టని రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలను తొలకాలు జరుపుతున్నా భారీ యంత్రాలైన జెసిబి లను లారీలను తక్షణమే సీజ్ చేయాలని సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల ఉద్యమం తప్పదని హెచ్చరించారు
ఈకార్య్రమంలో పార్టీ దుమ్ముగూడెం మండలం కార్యదర్శి దాసరి సాయన్న పార్టీ నాయకులు బాబురావు,భాస్కర్, ప్రవీణ్ తదితులు పాల్గొన్నాను

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !