+91 95819 05907

ఇసుక లారీ పంచాయతీ కార్మికుని ప్రాణం తీసింది

★ ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొట్టిన ఇసుక లారీ – స్పాట్లో చనిపోయిన జీపీ కార్మికుడు సారయ్య
★ మరో ముగ్గురు కార్మికులకు తప్పిన ముప్పు

నేటి గదర్ న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, ( మే 29):

గ్రామపంచాయతీ కార్మికులు చెత్త సేకరిస్తుండగా ట్రాక్టర్ ను వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో కార్మికుడు స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికు లు, జీపీ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు లోని ఎస్సీ కాలనీకి చెందిన బల్గూరి సారయ్య (52) గతంలో హమాలీ కార్మికునిగా పట్టణ వాసులకు సుపరిచితుడు. గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా కొన్నేళ్ల క్రితం నుంచి పనిచేస్తున్న సారయ్య మంగళవారం సాయంత్రం చెత్త సేకరించేందుకు ట్రాక్టర్ ను డ్రైవ్ చేస్తూ మరో ముగ్గురు కార్మికులు పైడి, రాజేందర్, వెంకన్నలతో కలిసి డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారిపై చెత్త సేకరణ చేస్తున్నారు. ఎన్ హెచ్ పై నాటిన మొక్కల మధ్య పెరిగిన గడ్డిని తొలగించగా దానిని సేకరిస్తుంగా సారయ్య ట్రాక్టర్ ట్రాలీలో ఉండి నేర్పుతున్నాడు. అయితే ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సారయ్య ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలై స్పాట్ లోనే చనిపో యాడు. తోటి కార్మికులు చెత్త సేకరిస్తుండగా తాము సైతం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని తెలిపారు. కాగా, జీపీ అధికారులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతుడు సారయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండ గా అందరికీ వివాహాలయ్యాయి. భార్య సరోజన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి జీపీ కార్యదర్శి రఘు, కార్మికులు, మాజీ పాలకవర్గం సభ్యులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్మికుని మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !