+91 95819 05907

ఇసుక లారీ పంచాయతీ కార్మికుని ప్రాణం తీసింది

★ ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొట్టిన ఇసుక లారీ – స్పాట్లో చనిపోయిన జీపీ కార్మికుడు సారయ్య
★ మరో ముగ్గురు కార్మికులకు తప్పిన ముప్పు

నేటి గదర్ న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, ( మే 29):

గ్రామపంచాయతీ కార్మికులు చెత్త సేకరిస్తుండగా ట్రాక్టర్ ను వెనుక నుంచి ఇసుక లారీ ఢీకొట్టడంతో కార్మికుడు స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికు లు, జీపీ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు లోని ఎస్సీ కాలనీకి చెందిన బల్గూరి సారయ్య (52) గతంలో హమాలీ కార్మికునిగా పట్టణ వాసులకు సుపరిచితుడు. గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా కొన్నేళ్ల క్రితం నుంచి పనిచేస్తున్న సారయ్య మంగళవారం సాయంత్రం చెత్త సేకరించేందుకు ట్రాక్టర్ ను డ్రైవ్ చేస్తూ మరో ముగ్గురు కార్మికులు పైడి, రాజేందర్, వెంకన్నలతో కలిసి డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారిపై చెత్త సేకరణ చేస్తున్నారు. ఎన్ హెచ్ పై నాటిన మొక్కల మధ్య పెరిగిన గడ్డిని తొలగించగా దానిని సేకరిస్తుంగా సారయ్య ట్రాక్టర్ ట్రాలీలో ఉండి నేర్పుతున్నాడు. అయితే ములుగు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సారయ్య ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలై స్పాట్ లోనే చనిపో యాడు. తోటి కార్మికులు చెత్త సేకరిస్తుండగా తాము సైతం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని తెలిపారు. కాగా, జీపీ అధికారులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతుడు సారయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండ గా అందరికీ వివాహాలయ్యాయి. భార్య సరోజన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి జీపీ కార్యదర్శి రఘు, కార్మికులు, మాజీ పాలకవర్గం సభ్యులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్మికుని మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !