+91 95819 05907

ఆ గిరిజనుడి గోడు అధికారికి పట్టదా..?

చెప్పులు అరిగేలా తిరిగిన గిరిజనుడికి దక్కని న్యాయం..!

కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసు ప్రొటెక్షన్ కల్పించమని పోలీస్ కు వేడుకోలు..!

భూ బాధితుడు పోడియం లక్ష్మయ్య.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం మే 29:

గిరిజనులకు గౌరవ కోర్టు వారు పోలీసు ప్రొటెక్షన్ కల్పించని ఉత్తర్వులు ఉన్నప్పటికీ గిరిజనులకు కల్పించకపోగా, గిరిజనేతరులకు వత్తాసు పలుకుతూ, గిరిజనులను రేపు,మాపు అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకుంటూ,పోలీసు నాన్చే ధోరణి అవలంబిస్తూన్నారని,భూ బాధితుడు పోడియం లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆరోపించారు.

వివరాల్లోకి వెళ్తే… అశ్వాపురం మండల పరిధిలోని అశ్వాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో పొడియం లక్ష్మయ్య అనే గిరిజనుడికి చెందిన సర్వే నెంబర్.400/ఇ8 నందు 0.22 గుంటల భూమికి గిరిజనేతరులు అడ్డుపడుతున్నారని మొబైల్ కోర్టు భద్రాచలం వారు గిరిజనులకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు.దానితో పాటు గిరిజనులు స్వేచ్చగా భూమిని అనుభవిచడానికి అడ్డంకులు సృష్టించకుండా పోలీసు ప్రొటెక్షన్ ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు.ఇదే విషయం స్థానిక పోలీస్ వారిని కోర్టు ఉత్తర్వుల ద్వారా పోలీసు ప్రొటెక్షన్ కల్పించమని దరఖాస్తు ద్వారా కోరగా,అడ్డుపడుతున్న గిరిజనేతరులకు ఎటువంటి ఉత్తర్వులు లేకపోయిన కానీ వారికి వత్తాసు పలికేలా స్థానిక పోలీసులు వ్యవహరిస్తున్నారని,
అది సరికాదని గిరిజనుడైన నాకు మొబైల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం న్యాయం చేయాలని బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు పోలీసు వారిని వేడుకుంటున్నారు.
పొడియం లక్ష్మయ్య అనే గిరిజన వృద్ధుడికి
న్యాయం జరగకపోతే,ఆదివాసి సేన ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను దశల వారీగా నిర్వహిస్తామని ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు వజ్జా జ్యోతి బస్ కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !