అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో…
PDSU రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మే 29:
భద్రాచలంలో మారుతీ పారా మెడికల్ కళాశాలలో మే 23వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన పగిడిపల్లి కారుణ్య మరణం పట్ల అనేక అనుమానాలకు తావిస్తుందని,కారుణ్య హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని దీనికి మారుతి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని పి డి యస్ యూ రాష్ట్ర కార్యదర్శి నామాల ఆజాద్,పి డి యస్ యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా మహాజన సోషలిస్ట్ పార్టీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు లత డిమాండ్ చేశారు.భద్రాచలం పట్టణం సీపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యాలయంలో బుధవారం పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతీ పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో గడిచిన 10 యేండ్ల కాలంలో దళిత,ఆదివాసి కుటుంబాలకు చెందిన విద్యార్థినిలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతూ అత్యాచారాలకు గురవుతున్నారని వారు ఆరోపించారు. మారుతి కళాశాలలో గతంలో జరిగిన మరణాల పట్ల కళాశాల సిబ్బంది,యాజమాన్య పాత్ర పై అనేక అనుమానాలు ఉన్నా సమగ్ర విచారణ జరగక పోవడంతో ఈ నిర్లక్ష్యపు కారణాల వల్ల నేడు విద్యార్థిని కారుణ్య మృతికి బలమైన కారణాలు అయ్యాయని వారు తెలిపారు.గతంలో మాదిరిగానే కారుణ్య మృతి రహస్యాలను కూడా బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం తమకు ఉన్న ఆర్థిక,రాజకీయ అంగ బలాన్ని ఆసరాగా చేసుకుని కారుణ్య మృతిని పలు విధాలుగా తప్పు దోవ పట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే భద్రాచలం పట్టణం నడి ఒడ్డున మా బిడ్డ మృతికి మారుతి కళాశాల యాజమాన్యమే కారణం అని కారుణ్య తల్లిదండ్రులు,బంధువులు తీవ్ర ఆవేదనకు లోనై మాకు న్యాయం చేయండి అని వేడుకున్న వారిని తప్పుడు మార్గంలో వారికి డబ్బు ఎరవేసి వారి నోరులను కట్టి వేశారని తెలిపారు.మీడియా సాక్షిగా వారు మా బిడ్డ మరణానికి మారుతి కళాశాల యాజమాన్యమే అని పలు రకాల వీడియోలు మన ముందు ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే బాధితులతో తప్పుడు సాక్షాలను సృష్టించి బయటి సమాజానికి రాత పూర్వకంగా వారి బిడ్డ మరణానికి కళాశాల యాజమాన్యానికి ఏమి సంబంధం లేదని చెప్పించిన తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తుందని వారు పేర్కొన్నారు.బాధిత కుటుంబం క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారని, వారి సాంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని బాక్స్ లో పెట్టి పూడ్చి పెట్టాలి కాని భవిష్యత్తులో ఎటువంటి సాక్షాధారాలు లభించకుండా డెడ్ బాడీని మారుతి కళాశాల ఒత్తిడి మేరకు మంటల్లో దహనం చేశారని మండిపడ్డారు.బాధిత కుటుంబం తో రహస్య ఒప్పందాలు చేసుకొని వారిని బయటికి రానియకుండా చేసినా జరిగిన సంఘటన అత్యంత దారుణమైనదని భవిష్యత్తులో మరొక విద్యార్థి ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోకుండా చర్యలు చేపట్టే విధంగా ఉండడం కోసమే పి డి ఎస్ యు,దళిత సంఘాలు కారుణ్య మృతిపై సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాలు,దళిత సంఘాలు చేసే న్యాయ పోరాటానికి భద్రాచలం పట్టణ ప్రముఖులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ నాయకులు శివాజీ,ఏజెన్సీ దళిత శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్,అనుసూచిత్ జాతి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను,కొంచర్ల కుమారి,గద్దల కృష్ణవేణి,ఎస్కే సల్మా,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ,పింగళి నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.