* గుడుంబాను నూరు శాతం నియంత్రిస్తాం
* కరకగూడెం SI రాజేందర్
నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:మండల పరిధిలోని కల్వలనాగరం అటవీ ప్రాంతంలో గుడుంబ తయారి ముమ్మరంగా సాగుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో కలసి అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో బెంలం పానకం డ్రమ్ములు దొరకడంతో వాటిని ధ్వంసం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ మండలంలో గుడుంబ(నాటు సార)ఎక్కువగా తయారు చేస్తున్నారని ,దానిని 100 % నియంత్రణ చెయ్యడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే కల్వలనాగారం గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న బెల్లం పానకం డ్రమ్ములను గుర్తించి బెల్లం పాకం పార పోయడం జరిగిందని అన్నారు.మండల వ్యాప్తంగా ఏ గ్రామంలో అయిన గుడుంబ తయారీ చేసినా కరకగూడెం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









