+91 95819 05907

ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు:మంత్రి పొంగులేటి

★పాలేరు నా సొంతిల్లు…. చక్కబెట్టుకునే బాధ్యత నాది

★మూడేళ్లలోపే అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు

★ ఏడాదిలోపు రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా

★ తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రానివ్వను

★ తిరుమలాయపాలెం మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేటి గదర్,మే 31 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లకోసం వచ్చే టైపు కాదు… ఇప్పుడు ఎన్నికలు లేవు… ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. మీ ఆశీస్సులు… దీవెనలతో ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయిన నేను మీ సమస్యలెంటో నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు వచ్చాను. మీరు నాకిప్పుడు ప్రతి వినతిని పరిశీలించి.. వాటిన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కారింపజేసేందుకు కృషిచేస్తానని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారాం, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం, ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి ఇళ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు తదితర సమస్యల పై ఇచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే… పాలేరు నా సొంతిల్లు… చక్కబెట్టుకునే బాధ్యత నాదే…. మీ ఇంటి పెద్దకొడుకుగా నన్ను భావించి… అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి మంత్రిగా నాకు అవకాశం కలిగేలా సహకరించిన మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా అని తెలిపారు… రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ ఇంటి మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ మూడేళ్లలోపే ఇల్లు దక్కేలా చూస్తానని మీకు హామీ ఇస్తున్నా..! అదేవిధంగా ఏడాదిలోపే నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా అన్నారు… తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను. విద్యా, వైద్యం, ఆరోగ్యం ఇలా ఏ రకమైన సమస్య వచ్చినా తీర్చే బాధ్యత నాదంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !