+91 95819 05907

ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు:మంత్రి పొంగులేటి

★పాలేరు నా సొంతిల్లు…. చక్కబెట్టుకునే బాధ్యత నాది

★మూడేళ్లలోపే అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు

★ ఏడాదిలోపు రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా

★ తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రానివ్వను

★ తిరుమలాయపాలెం మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నేటి గదర్,మే 31 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లకోసం వచ్చే టైపు కాదు… ఇప్పుడు ఎన్నికలు లేవు… ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. మీ ఆశీస్సులు… దీవెనలతో ఇక్కడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని అయిన నేను మీ సమస్యలెంటో నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారించేందుకు వచ్చాను. మీరు నాకిప్పుడు ప్రతి వినతిని పరిశీలించి.. వాటిన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కారింపజేసేందుకు కృషిచేస్తానని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారాం, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం, ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి ఇళ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు తదితర సమస్యల పై ఇచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే… పాలేరు నా సొంతిల్లు… చక్కబెట్టుకునే బాధ్యత నాదే…. మీ ఇంటి పెద్దకొడుకుగా నన్ను భావించి… అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి మంత్రిగా నాకు అవకాశం కలిగేలా సహకరించిన మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా అని తెలిపారు… రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో ప్రతీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆ ఇంటి మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ మూడేళ్లలోపే ఇల్లు దక్కేలా చూస్తానని మీకు హామీ ఇస్తున్నా..! అదేవిధంగా ఏడాదిలోపే నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేయిస్తా అన్నారు… తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను. విద్యా, వైద్యం, ఆరోగ్యం ఇలా ఏ రకమైన సమస్య వచ్చినా తీర్చే బాధ్యత నాదంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది:మంత్రి పొంగులేటి

TELANGANA CABINET POINTS 1. మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది. స్థానిక

Read More »

BRS: బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్లు నేటి గదర్ న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ

Read More »

Guru Powrnami: సీనియర్ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

— అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది గురువులు — మణుగూరు ఎస్బిఐ బ్రాంచ్ సీనియర్ హెడ్ మెసెంజర్ గీదె మోహన్ రావు ౼ మండల వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నేటి

Read More »

జులై 14 న జవహర్ నవోదయ విద్యాలయం ప్రారంభం‌‌‌‌‌‌‌‌

*జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లను పరిశీలించిన విద్యాశాఖాధికారి ఎం వెంకటేశ్వర చారి* నేటి గదర్‌ కరకగూడెం: ఈనెల 14వ తేదీన ప్రారంభం ప్రారంభించనున్న జవహర్ నవోదయ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర

Read More »

తెలంగాణ రైతులు యూరియా వాడకం తగ్గించుకోవాలి :కేంద్ర మంత్రి జేపీ నడ్డా

నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్: తెలంగాణలో నిజమైన అవసరాలుంటేనే సహాయం చేస్తాము యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో యూరియా కొరతను నిర్మూలించాలని, సరిపడా

Read More »

కార్మికులను బానిసలుగా మార్చుతున్న కేంద్ర ప్రభుత్వం.

వైరా పట్టణంలో కదం తొక్కిన కార్మిక లోకం కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమాలు కొనసాగిస్తాం అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు నేటి గదర్ న్యూస్, వైరా:- దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా సిఐటియూ, టియుసిఐ,

Read More »

 Don't Miss this News !