+91 95819 05907

త్వరలో టొబాకో ప్రోడక్ట్ యాక్ట్ 2003 అమలు కొరకు పోలీస్ వారి సహకారంతో ప్రత్యేక డ్రైవులు

పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (మే 31):

ములుగులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రపంచ దేశాలలో అన్నింటిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవమును ప్రతి సంవత్సరం మే 31 రోజున నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి నుండి ర్యాలీని డాక్టర్ అప్పయ్య గారు జెండా ఊపి ప్రారంభించడం జరిగినది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థిమును ప్రజలలోకి అవగాహన కొరకు పంపించడం జరుగుతుంది అది, ఈ సంవత్సరం థీమ్
“పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం” అని తెలిపినారు.
ఈ అవగాహన ర్యాలీలో వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ప్రతిజ్ఞ
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా, నేను నా జీవితంలో ఏ రకమైన పొగాకు ఉత్పత్తులను ఎప్పుడూ ఉపయోగించనని, లేదా తిననని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తులందరినీ పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకూడదని నేను అవగాహన కల్పిస్తానని, పొగాకు ఉత్పత్తుల వాడకం నుండి నా పర్యావరణ రక్షణకు కూడా నేను సహకరిస్తానని ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. భారతదేశంలో ప్రతి 8 మంది యువకులలో ఒకరు పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో మూడు లక్షల పైచిలుకు మరణాలు కేవలం ఒక పొగాకు ఉత్పత్తులు వాడటం వలన మరణాలు సంభవిస్తున్నాయని who అంచనా ధూమపానం చేయటం వలన పొగ తాగే వారికి కాకుండా చుట్టుపక్కల పరిసరాలు వారికి కూడా ఆరోగ్యానికి హానిచేయునని తెలియజేశారు. పొగాకులో ఉండే నికోటిన్ పదార్థం మెదడుపై పనిచేసి మత్తు బానిస కూలుగా గురి అవుతున్నారని తెలిపారు.
గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే ప్రకారం ధూమపానం పొగాకు వినియోగం మొత్తం 10.38% ఉన్నదని తెలియజేశారు . సిగరెట్ మరియు టొబాకో ప్రోడక్ట్ యాక్ట్ 2003 అమలు కొరకు జిల్లా కలెక్టర్ పోలీస్ వారి సహకారంతో ప్రత్యేక డ్రైవులు నిర్వహించడం జరుగునని తెలిపారు.
ఇందులో భాగంగా ములుగు పట్టణములో స్థానికంగా ఉన్న పాన్ పాన్ షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగినది.
షాపు యజమానులను పొగాకు గుట్కాలు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది.
ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో బస్టాండ్లో, రైల్వేస్టేషన్లో, సినిమా హాల్లో, మార్కెట్లో, విద్యాసంస్థలు, ఆసుపత్రులు వంటి ప్రదేశాలలో పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు వాడటం లేదా అమ్మకం జరిపిన, ఉల్లంఘించిన వారికి 2000 జరిమానాలతో పాటు జైలు శిక్ష ఉంటుందని మరియు 18 సంవత్సరాలు లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించిన వారిపై జరిమానా విధించబడునని తెలియజేశారు. పొగలేని ధూమపానం ఉదాహరణకు అంబారు, ఖైని, గుట్కా వంటి వాటిని ఇరవై ఒక్క శాతం మంది వాడుతున్నారని, ఇందులో 41% మగవారు మరియు 14% ఆడవారు పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ మరియు ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ రవీందర్,
డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్, రాయిని గూడెం వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్, డెమో తిరుపతయ్య, జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్స్ వంగేటి వెంకటేశ్వర్లు ,పి భూపాల్ రెడ్డి, Cho దుర్గారావు,P. సంపత్ రావు, మరియు హెల్త్ ఎడ్యుకేటర్లు సంపత్ ,భాస్కర్, PHC రాయనిగూడెం, MLHPS ఏఎన్ఎమ్స్ ఆశాలు తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి – మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరున లేఖ విడుదల నేటి గదర్

Read More »

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

 Don't Miss this News !