+91 95819 05907

అనుమతి లేని విత్తనాల అమ్మితే కఠిన చర్యలు.

.

విత్తనాలు కొనే రైతులు అప్రమత్తంగా ఉండాలి..

లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి..

విత్తనాలు కొన్న బిల్లును ,ఖాళీ ప్యాకెట్లను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి..

ఏఓ రామడుగు వాణి..

నేటి గదర్,మే 31 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

కూసుమంచి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో రైతులకు నకిలీ విత్తనాల పై వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారిని రామడుగు వాణి మాట్లాడుతూ.. రైతులందరూ విత్తనాలను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుండి మాత్రమే తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలను విక్రయిస్తున్నట్లయితే అటువంటి సమాచారాన్ని వెంటనే మండల వ్యవసాయ అధికారికి లేదా పోలీసు శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. రైతులు విత్తనాలు కొన్న బిల్లును ఖాళీ ప్యాకెట్లను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా పత్తి గింజలు విత్తుకోవాలంటే తగిన వర్షపాతం అనగా 60 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చిన తర్వాత మాత్రమే పత్తి గింజలను విత్తుకోవాలని లేదంటే భూమిలోని వేడికి గింజలు సరిగా మొలకెత్తవని సూచించారు. అనంతరం పచ్చి రొట్టె ఎరువుల వలన కలిగే ప్రయోజనాలు, వరి పత్తి మిరప సాగులో మెళకువలు, ఎరువుల యజమాన్యం మొదలగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి, ఏఈవో వంశికృష్ణ , రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !