+91 95819 05907

నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకోవడం ఫాసిస్ట్ చర్య:సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

– అప్రజాస్వామిక చర్యను ఖండించండి
– సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

నేటి గదర్, మే 31, డెస్క్ ప్రతినిధి :

దండకారణ్యంలో “కగార్’ పేరిట మోడీ ప్రభుత్వం సాగించే మారణహోమంపై నిజానిర్ధారణ బృందాన్ని అడ్డుకున్న అప్రజాస్వామిక చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలు ఖండించాలని సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఏ.పి. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో ఆదివాసీలని, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టులని నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ని మోడీ ప్రభుత్వం రూపకల్పన చేసిందని, జనవరి 1 నుండి మారణహోమాన్ని సాగిస్తోందని ఆరోపించారు. అడవి ప్రాంతాన్ని రక్తసిక్తం చేస్తూ, వరసగా బూటకపు ఎదురు కాల్పులకి దిగుతున్నారని, ఈ మారణ హెూమంపై విచారణ కోసం CDRO, పౌరహక్కుల సంఘాలు 52 మందితో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని మే 30న ఛత్తీస్ ఘడ్ దండకారణ్యానికి వెళ్లేందుకు బయలుదేరారని తెలిపారు. వారిని తెలంగాణ దాటి కుంట మీదుగా వెళ్తుండగా నిన్న 30న కుంట వద్ద CRPF అడ్డుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తమ గమ్యం స్థానం చేరే లక్ష్యంతో మరో మార్గంలో ప్రయత్నించగా బీజాపూర్ ప్రాంతానికి 40 కి. మీ దూరంలో తారగూడ వద్ద CRPF ఆపివేయగా, పై చర్యకు నిరసనగా బృందం రోడ్డుపై బైఠాయించినట్లు సమాచారం ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేంద్రంలోని ఆరెస్సెస్ – బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్య మాత్రమే కాకుండా పచ్చి ఫాసిస్టు రాజానీతితో కూడిన చర్యగా కూడా మా పార్టీ భావిస్తున్నామని వెల్లడించారు. అడవి సంపద మౌలికంగా సామాజికమైనది. అడవుల్లో వుండే అపారమైన ఖనిజ సంపద మీద దేశ ప్రజలకు సామూహిక హక్కు ఉన్నదని, అడవుల్లో పుట్టి అక్కడే పెరిగే ఆదివాసులకు సహజ హక్కుదార్లుగా ఉండడంతో పాటు దేశ ప్రజల సమిష్టి వన సంపదకు వారు సెక్యూరిటీ గార్డు పాత్రను కూడా పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఆదివాసీ ప్రాంతాలని బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నెత్తుటి మడుగుగా మార్చే మోడీ సర్కార్ ఫాసిస్టు చర్యని, వివిధ హక్కుల సంఘాలు నియమించిన నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలకు ఖండించాలని వై.సాంబశివరావు ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !