+91 95819 05907

నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకోవడం ఫాసిస్ట్ చర్య:సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

– అప్రజాస్వామిక చర్యను ఖండించండి
– సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

నేటి గదర్, మే 31, డెస్క్ ప్రతినిధి :

దండకారణ్యంలో “కగార్’ పేరిట మోడీ ప్రభుత్వం సాగించే మారణహోమంపై నిజానిర్ధారణ బృందాన్ని అడ్డుకున్న అప్రజాస్వామిక చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలు ఖండించాలని సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఏ.పి. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో ఆదివాసీలని, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టులని నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ని మోడీ ప్రభుత్వం రూపకల్పన చేసిందని, జనవరి 1 నుండి మారణహోమాన్ని సాగిస్తోందని ఆరోపించారు. అడవి ప్రాంతాన్ని రక్తసిక్తం చేస్తూ, వరసగా బూటకపు ఎదురు కాల్పులకి దిగుతున్నారని, ఈ మారణ హెూమంపై విచారణ కోసం CDRO, పౌరహక్కుల సంఘాలు 52 మందితో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని మే 30న ఛత్తీస్ ఘడ్ దండకారణ్యానికి వెళ్లేందుకు బయలుదేరారని తెలిపారు. వారిని తెలంగాణ దాటి కుంట మీదుగా వెళ్తుండగా నిన్న 30న కుంట వద్ద CRPF అడ్డుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తమ గమ్యం స్థానం చేరే లక్ష్యంతో మరో మార్గంలో ప్రయత్నించగా బీజాపూర్ ప్రాంతానికి 40 కి. మీ దూరంలో తారగూడ వద్ద CRPF ఆపివేయగా, పై చర్యకు నిరసనగా బృందం రోడ్డుపై బైఠాయించినట్లు సమాచారం ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేంద్రంలోని ఆరెస్సెస్ – బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్య మాత్రమే కాకుండా పచ్చి ఫాసిస్టు రాజానీతితో కూడిన చర్యగా కూడా మా పార్టీ భావిస్తున్నామని వెల్లడించారు. అడవి సంపద మౌలికంగా సామాజికమైనది. అడవుల్లో వుండే అపారమైన ఖనిజ సంపద మీద దేశ ప్రజలకు సామూహిక హక్కు ఉన్నదని, అడవుల్లో పుట్టి అక్కడే పెరిగే ఆదివాసులకు సహజ హక్కుదార్లుగా ఉండడంతో పాటు దేశ ప్రజల సమిష్టి వన సంపదకు వారు సెక్యూరిటీ గార్డు పాత్రను కూడా పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఆదివాసీ ప్రాంతాలని బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నెత్తుటి మడుగుగా మార్చే మోడీ సర్కార్ ఫాసిస్టు చర్యని, వివిధ హక్కుల సంఘాలు నియమించిన నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలకు ఖండించాలని వై.సాంబశివరావు ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

విజయ్, రష్మిక సంగీత్ వేడుక..వైరల్

విజయ్, రష్మిక సంగీత్ వేడుక.. ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక (VIROSH) వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుక అంబరాన్నంటింది. విజయ్ దేవరకొండ, రష్మిక తమ డ్యాన్స్

Read More »

37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి ఇద్దరు వృద్ధులను పెళ్లాడింది

“సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లేదు.. కట్టుబాట్ల గురించి ఎలాంటి సంకోచం లేదు. వారికి కావాల్సింది కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ. దీంతోనే 37 ఏళ్ల ఓ మహిళ.. ఒకేసారి

Read More »

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

 Don't Miss this News !