+91 95819 05907

నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకోవడం ఫాసిస్ట్ చర్య:సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

– అప్రజాస్వామిక చర్యను ఖండించండి
– సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

నేటి గదర్, మే 31, డెస్క్ ప్రతినిధి :

దండకారణ్యంలో “కగార్’ పేరిట మోడీ ప్రభుత్వం సాగించే మారణహోమంపై నిజానిర్ధారణ బృందాన్ని అడ్డుకున్న అప్రజాస్వామిక చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలు ఖండించాలని సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఏ.పి. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో ఆదివాసీలని, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టులని నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ని మోడీ ప్రభుత్వం రూపకల్పన చేసిందని, జనవరి 1 నుండి మారణహోమాన్ని సాగిస్తోందని ఆరోపించారు. అడవి ప్రాంతాన్ని రక్తసిక్తం చేస్తూ, వరసగా బూటకపు ఎదురు కాల్పులకి దిగుతున్నారని, ఈ మారణ హెూమంపై విచారణ కోసం CDRO, పౌరహక్కుల సంఘాలు 52 మందితో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని మే 30న ఛత్తీస్ ఘడ్ దండకారణ్యానికి వెళ్లేందుకు బయలుదేరారని తెలిపారు. వారిని తెలంగాణ దాటి కుంట మీదుగా వెళ్తుండగా నిన్న 30న కుంట వద్ద CRPF అడ్డుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తమ గమ్యం స్థానం చేరే లక్ష్యంతో మరో మార్గంలో ప్రయత్నించగా బీజాపూర్ ప్రాంతానికి 40 కి. మీ దూరంలో తారగూడ వద్ద CRPF ఆపివేయగా, పై చర్యకు నిరసనగా బృందం రోడ్డుపై బైఠాయించినట్లు సమాచారం ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేంద్రంలోని ఆరెస్సెస్ – బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్య మాత్రమే కాకుండా పచ్చి ఫాసిస్టు రాజానీతితో కూడిన చర్యగా కూడా మా పార్టీ భావిస్తున్నామని వెల్లడించారు. అడవి సంపద మౌలికంగా సామాజికమైనది. అడవుల్లో వుండే అపారమైన ఖనిజ సంపద మీద దేశ ప్రజలకు సామూహిక హక్కు ఉన్నదని, అడవుల్లో పుట్టి అక్కడే పెరిగే ఆదివాసులకు సహజ హక్కుదార్లుగా ఉండడంతో పాటు దేశ ప్రజల సమిష్టి వన సంపదకు వారు సెక్యూరిటీ గార్డు పాత్రను కూడా పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఆదివాసీ ప్రాంతాలని బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నెత్తుటి మడుగుగా మార్చే మోడీ సర్కార్ ఫాసిస్టు చర్యని, వివిధ హక్కుల సంఘాలు నియమించిన నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలకు ఖండించాలని వై.సాంబశివరావు ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !