+91 95819 05907

నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకోవడం ఫాసిస్ట్ చర్య:సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

– అప్రజాస్వామిక చర్యను ఖండించండి
– సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

నేటి గదర్, మే 31, డెస్క్ ప్రతినిధి :

దండకారణ్యంలో “కగార్’ పేరిట మోడీ ప్రభుత్వం సాగించే మారణహోమంపై నిజానిర్ధారణ బృందాన్ని అడ్డుకున్న అప్రజాస్వామిక చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలు ఖండించాలని సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఏ.పి. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి వై.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో ఆదివాసీలని, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టులని నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ని మోడీ ప్రభుత్వం రూపకల్పన చేసిందని, జనవరి 1 నుండి మారణహోమాన్ని సాగిస్తోందని ఆరోపించారు. అడవి ప్రాంతాన్ని రక్తసిక్తం చేస్తూ, వరసగా బూటకపు ఎదురు కాల్పులకి దిగుతున్నారని, ఈ మారణ హెూమంపై విచారణ కోసం CDRO, పౌరహక్కుల సంఘాలు 52 మందితో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని మే 30న ఛత్తీస్ ఘడ్ దండకారణ్యానికి వెళ్లేందుకు బయలుదేరారని తెలిపారు. వారిని తెలంగాణ దాటి కుంట మీదుగా వెళ్తుండగా నిన్న 30న కుంట వద్ద CRPF అడ్డుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తమ గమ్యం స్థానం చేరే లక్ష్యంతో మరో మార్గంలో ప్రయత్నించగా బీజాపూర్ ప్రాంతానికి 40 కి. మీ దూరంలో తారగూడ వద్ద CRPF ఆపివేయగా, పై చర్యకు నిరసనగా బృందం రోడ్డుపై బైఠాయించినట్లు సమాచారం ఉన్నదని ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేంద్రంలోని ఆరెస్సెస్ – బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్య మాత్రమే కాకుండా పచ్చి ఫాసిస్టు రాజానీతితో కూడిన చర్యగా కూడా మా పార్టీ భావిస్తున్నామని వెల్లడించారు. అడవి సంపద మౌలికంగా సామాజికమైనది. అడవుల్లో వుండే అపారమైన ఖనిజ సంపద మీద దేశ ప్రజలకు సామూహిక హక్కు ఉన్నదని, అడవుల్లో పుట్టి అక్కడే పెరిగే ఆదివాసులకు సహజ హక్కుదార్లుగా ఉండడంతో పాటు దేశ ప్రజల సమిష్టి వన సంపదకు వారు సెక్యూరిటీ గార్డు పాత్రను కూడా పోషిస్తున్నారని అన్నారు. అలాంటి ఆదివాసీ ప్రాంతాలని బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నెత్తుటి మడుగుగా మార్చే మోడీ సర్కార్ ఫాసిస్టు చర్యని, వివిధ హక్కుల సంఘాలు నియమించిన నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చర్యను వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలకు, ప్రజలకు ఖండించాలని వై.సాంబశివరావు ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

ఝాన్సీలింగాపూర్ లో కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన కాల్వల రాజు (36) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి వృత్తిరీత్యా మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ పనిచేస్తుంటాడు.తను శుక్రవారం

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ విఎస్టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం

Read More »

డైమండ్ చెస్ అకాడమీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- సైనిక్ పురిలో డైమండ్ చెస్ అకాడమీనీ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ప్రారంభించారు.అంతర్జాతీయ చెస్ క్రీడాకారులైనటువంటి దివ్య

Read More »

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

 Don't Miss this News !