+91 95819 05907

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు సకాలంలో పూర్తి చేయాలి

★ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ.

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, ( జూన్ 01):

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ పి శ్రీజ వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జవహర్ నగర్ గ్రామం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు ఆదర్శ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకూడదని, విద్యార్థులకు ఉపయోగపడే అత్యవసర పనులను త్రాగునీరు, మూత్రశాలల మరమ్మతులు, ఎలక్ట్రిఫికేషన్ లాంటి కనీస అవసరాలను అమ్మ ఆదర్శ పాఠశాల పనులలో ఎంపిక చేసి పూర్తి చేయడం జరుగుచున్నదని తెలిపారు. కేజీబీవీ వెంకటాపూర్ పాఠశాలలో విద్యార్థుల అవసరాల కోసం మౌలిక సదుపాయాలు కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పనులు పూర్తి చేసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పాఠశాల పున ప్రారంభం కంటే ముందే పూర్తి చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిని ఆదేశించారు. జరుగుతున్న పనులను ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయవలసిందిగా ఏ ఈ లను, మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, సమగ్ర శిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, ములుగు, వెంకటాపూర్ మండలాల తాత్కాలిక ఇన్చార్జి మండల విద్యాశాఖ అధికారి సూర్యనారాయణ, ఏఈ తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !