+91 95819 05907

అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం

★శతాధిక ప్రతిష్టాపక సిద్ధాంతి వేల్పుల వీరస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం

★4వ రోజు బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం

★ 2500 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం

★ అలరించిన డప్పు కళాకారులు

★పినపాక కు పోటెత్తిన భక్త జనం

నేటి గద్ధర్ న్యూస్,(పినపాక):

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్

✍️కొత్త దామోదర్ గౌడ్

మండలంలోని పినపాక గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 4 వ రోజు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటి మూడు రోజులు ప్రత్యేక పూజలు చేసి నాలుగవ రోజు వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. పినపాక లో శనివారం నిర్వహించిన గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వాడ వాడ నుంచి జనం తరలివచ్చారు. శ్రీ శీతల పరమేశ్వరి నాభిశిల( బొడ్రాయి) విగ్రహాల ప్రతిష్ట ప్రాంతం భక్తజన సంద్రమైంది.

కలష గణపతి పూజ, పుణ్యహవచనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజారులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రతిష్టా మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. మహి ళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి గ్రామ దేవతల ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి గ్రామస్తుల బంధువులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 4వ రోజు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం లో కన్నుల పండుగగా సాగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న ఆయన దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనం అన్నారు. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు. ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని. ఊరిలోని వారంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి మహోత్సవ ఉత్సవ కమిటీ, ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !