+91 95819 05907

అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం

★శతాధిక ప్రతిష్టాపక సిద్ధాంతి వేల్పుల వీరస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం

★4వ రోజు బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం

★ 2500 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం

★ అలరించిన డప్పు కళాకారులు

★పినపాక కు పోటెత్తిన భక్త జనం

నేటి గద్ధర్ న్యూస్,(పినపాక):

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్

✍️కొత్త దామోదర్ గౌడ్

మండలంలోని పినపాక గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 4 వ రోజు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటి మూడు రోజులు ప్రత్యేక పూజలు చేసి నాలుగవ రోజు వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. పినపాక లో శనివారం నిర్వహించిన గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వాడ వాడ నుంచి జనం తరలివచ్చారు. శ్రీ శీతల పరమేశ్వరి నాభిశిల( బొడ్రాయి) విగ్రహాల ప్రతిష్ట ప్రాంతం భక్తజన సంద్రమైంది.

కలష గణపతి పూజ, పుణ్యహవచనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజారులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రతిష్టా మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. మహి ళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి గ్రామ దేవతల ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి గ్రామస్తుల బంధువులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 4వ రోజు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం లో కన్నుల పండుగగా సాగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న ఆయన దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనం అన్నారు. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు. ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని. ఊరిలోని వారంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి మహోత్సవ ఉత్సవ కమిటీ, ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !