+91 95819 05907

అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం

★శతాధిక ప్రతిష్టాపక సిద్ధాంతి వేల్పుల వీరస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం

★4వ రోజు బొడ్రాయి, ముత్యాలమ్మ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం

★ 2500 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం

★ అలరించిన డప్పు కళాకారులు

★పినపాక కు పోటెత్తిన భక్త జనం

నేటి గద్ధర్ న్యూస్,(పినపాక):

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్

✍️కొత్త దామోదర్ గౌడ్

మండలంలోని పినపాక గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 4 వ రోజు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటి మూడు రోజులు ప్రత్యేక పూజలు చేసి నాలుగవ రోజు వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. పినపాక లో శనివారం నిర్వహించిన గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వాడ వాడ నుంచి జనం తరలివచ్చారు. శ్రీ శీతల పరమేశ్వరి నాభిశిల( బొడ్రాయి) విగ్రహాల ప్రతిష్ట ప్రాంతం భక్తజన సంద్రమైంది.

కలష గణపతి పూజ, పుణ్యహవచనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజారులు వేద మంత్రోచ్ఛరణలతో ప్రతిష్టా మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. మహి ళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి గ్రామ దేవతల ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి గ్రామస్తుల బంధువులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 4వ రోజు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం లో కన్నుల పండుగగా సాగుతున్న బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న ఆయన దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనం అన్నారు. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు. ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారని. ఊరిలోని వారంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి మహోత్సవ ఉత్సవ కమిటీ, ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వ బోర్డులు పెట్టిన భూములకు రక్షణ ఏది ?అన్నవరపు

◆సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య మణుగూరు20: సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర పు కనకయ్య

Read More »

ఇద్దరు యువకులు మృతి చెందిన కుటుంబాలకు గ్రామస్తులంతా కలసి సహకారం.

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతన్ శెట్టిపల్లి గ్రామంలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతాంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి

Read More »

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… !!!

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో… అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది…!! అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు…!! ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా

Read More »

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు బట్టీవిక్రమార్క చొరవతో ఈ రోజు పాతర్లపాడు గ్రామ పెంటి నర్సమ్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ 21000 రూపాయలు అందించటం జరిగింది.

Read More »

 Don't Miss this News !