– ITDA PO ప్రతీక్ జైన్
నేటి గదర్, 02 జూన్, భద్రాద్రి కొత్తగూడెం :
సుదీర్ఘ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణను 29వ రాష్ట్రంగా సాధించుకొని 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి చేరుకోవడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఆదివారం నాడు ఐటిడిఏ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, అమరవీరుల స్థూపం కు నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహం కు పూజలు జరిపి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్యా, వైద్యం, ఇంజనీరింగ్ వ్యవసాయం, మౌలిక వసతులు సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో తనకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. ఎందరో అమరుల త్యాగాలకు, ఎన్నో సుదీర్ఘ పోరాటాలకు ఫలితంగా అవతరించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏడీఎంహెచ్వో భాస్కర్, ఎస్ ఓ సురేష్ బాబు, హెచ్ ఎన్ టి సి అశోక్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, ఏ సి ఎం.ఓ రమణయ్య, ఏటిడిఓ నరసింహారావు, పవర్ ఏపీఓ మునీర్ పాషా, అగ్రికల్చర్ ఏడి భాస్కర్, మేనేజర్ ఆదినారాయణ, ఐటీడీఏ కార్యాలయం విభాగంలోని అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.