+91 95819 05907

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ

– ITDA PO ప్రతీక్ జైన్

నేటి గదర్, 02 జూన్, భద్రాద్రి కొత్తగూడెం :

సుదీర్ఘ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణను 29వ రాష్ట్రంగా సాధించుకొని 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి చేరుకోవడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఆదివారం నాడు ఐటిడిఏ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, అమరవీరుల స్థూపం కు నివాళులు అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహం కు పూజలు జరిపి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్యా, వైద్యం, ఇంజనీరింగ్ వ్యవసాయం, మౌలిక వసతులు సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో తనకు అవకాశం కల్పించినందుకు సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. ఎందరో అమరుల త్యాగాలకు, ఎన్నో సుదీర్ఘ పోరాటాలకు ఫలితంగా అవతరించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏడీఎంహెచ్వో భాస్కర్, ఎస్ ఓ సురేష్ బాబు, హెచ్ ఎన్ టి సి అశోక్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, ఏ సి ఎం.ఓ రమణయ్య, ఏటిడిఓ నరసింహారావు, పవర్ ఏపీఓ మునీర్ పాషా, అగ్రికల్చర్ ఏడి భాస్కర్, మేనేజర్ ఆదినారాయణ, ఐటీడీఏ కార్యాలయం విభాగంలోని అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కరెంట్ షాక్ తో మృతి చెందిన యువతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి -తంబల్ల రవి

అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం నేటి గద్దర్ న్యూస్, అన్నపురెడ్డిపల్లి, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామంలో గురువారం కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన

Read More »

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి -అఖిలపక్షం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత

Read More »

చేగుంటలో కాలిపోయిన మహిళ హత్య కేసును చేదించిన చేగుంట పోలీసులు

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15 . మెదక్ జిల్లా చేగుంటలో ఈనెల 7న 44 జాతీయ రహదారిపై గుర్తుతెలియని మహిళను పెట్రోల్ పోసి దహనం చేయగా కేసు నమోదు

Read More »

ఐకెపి సెంటర్ వద్ద తడిసిన వరి ధాన్యం

*ఐకెపి సెంటర్ వద్ద తడిసిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతుల* నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15. మెదక్ జిల్లా వెల్దుర్తి అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read More »

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి…

నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి… బిజీ కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు 63 లక్షలతో శాంక్షన్ అయి జిల్లా

Read More »

దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు.

★పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్….. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు

Read More »

 Don't Miss this News !