+91 95819 05907

కుంటుపడిన మణుగూరు మున్సిపాలిటీ.

పేరు గొప్ప ఊరు దిబ్బలా మున్సిపాలిటి…

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 5 :
నైనారపు నాగేశ్వరరావు ✍️
789 353 8668.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో అతి పెద్ద పట్టణం మణుగూరు, పేరుకు పెద్దదే గాని పట్టణంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా దర్శన మిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. మణుగూరు పురపాలకానికి 17 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని స్థానిక ప్రజలు కోడై కూస్తున్నారు.మణుగూరు మున్సిపాలిటీ పై ప్రభుత్వం చొరవ చూపాలని పుర ప్రముఖులు కోరుతున్నారు. మణుగూరు పురపాలకంలో సుమారుగా 20 వార్డులు ఉన్నాయి.పట్టణ జనాభా 50 వేల మంది ప్రజలకు పై చిలుకు నివసిస్తున్నారు. అధికారుల పాలన కొనసాగుతుండడంతో పట్టణంలో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది.పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదని,ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని పలువురు మండిపడుతున్నారు.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు మూలన పడ్డాయని, వాటికి మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదని,దీంతో అవి త్రుప్పు పడుతున్నాయని ప్రజలు మండి పడుతున్నారు.మణుగూరు పాలకమండలి లేకపోవడంతో మునిసిపల్ అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.వచ్చిన కమిషన్లతో మునిసిపాలిటీ అధికారులు ఇష్టానుసారంగా దండుకుంటున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.ఇంటి పన్నులు ఇష్టానురీతిలో పెంచుతూ,పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మణుగూరు మున్సిపాలిటీకి పాలకవర్గం లేక పోవడంతో మున్సిపల్ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పేరు గొప్ప ఊరు దిబ్బలా మణుగూరు…

మణుగూరు మున్సిపాలిటీ పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందని ప్రజలు ప్రజాతంత్ర వాదులు, అభ్యుదయవాదులు ఆరోపిస్తున్నారు.ఒక్కసారి కూడా చెత్త వాహనాలు రావడం లేదని మణుగూరు పట్టణం సుందరయ్య నగర్ ఏరియాలో సైడ్ డ్రైనేజీలు చెత్తతో నిండిపోయి మురికి వాసన దోమలతో రోగాల బారీన ప్రజలు పడుతున్నారని,ప్రజలని పట్టించుకోవడం లేదని మణుగూరు మున్సిపాలిటీలో కమీషనర్ ఉన్నాడా లేడా అని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు.కేవలం ఇంటి పన్నుల కోసమే వస్తారని మున్సిపాలిటీ ప్రజలు మండిపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వర్షం పడితే ఇండ్లు మొత్తం ముంపుకు గురవుతున్నాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు రాకముందే డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను శుభ్రం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పట్టణ అభివృద్ధి కుంటుపడిందని పట్టణ పురపాలకకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !