+91 95819 05907

డెంగ్యూ జ్వరాలతో మృత్యువాత పడుతున్న ప్రజలు:CPM

ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్…

సిపిఎం చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు.

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి (చర్ల) జూన్ 5:

చర్ల మండలంలోని ప్రజలు డెంగ్యూ జ్వరాలతో మృత్యువాత పడుతున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో తక్షణమే ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలని,సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏజెన్సీ పల్లెల్లో ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని,మెరుగైన వైద్యం అందించాలని కోరారు.చర్ల మండల కేంద్రంలోని మొగలపల్లి గ్రామపంచాయతీలోని ఆనంద్ కాలనీ గ్రామంలో అనేక మంది విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీ లోని ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సత్యనారాయణపురం గ్రామపంచాయతీలోని ప్రజలు కూడా డెంగ్యూ జ్వరాలతో నానా అగచాట్లు పడుతున్నారని అన్నారు.పెద్దపల్లి ప్రజలు కూడా విష జ్వరాలతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రైవేటు వైద్యం కోసం పట్టణాలకు పరిగెడుతున్నారని ఆవేదన వ్యక్తం.కొత్త పెళ్లి గ్రామంలో చిన్న ముసిలేరు గ్రామంలో కనీసం 25 సంవత్సరాల వయసు పూర్తికాని యువకులు చర్ల ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందక దగ్గర్లో ఉన్న భద్రాచలం పట్టణ కేంద్రానికి వెళ్లి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కొరకు లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం పొందిన ఈ ప్రాంతంలోని గిరిజన బిడ్డ ప్రాణాలు దక్కలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.చనిపోయిన గిరిజన,దళిత కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని,చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇకనైనా చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలుగా తీర్చిదిద్ది సీనియర్ డాక్టర్లను నియామకం చేపట్టి ఈ మూడు ప్రభుత్వ వైద్యశాలల నందు పూర్తిస్థాయి సీనియర్ వైద్య సిబ్బందిని నియమించి,అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించి ఏజెన్సీలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !