+91 95819 05907

డెంగ్యూ జ్వరాలతో మృత్యువాత పడుతున్న ప్రజలు:CPM

ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్…

సిపిఎం చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు.

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి (చర్ల) జూన్ 5:

చర్ల మండలంలోని ప్రజలు డెంగ్యూ జ్వరాలతో మృత్యువాత పడుతున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో తక్షణమే ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలని,సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏజెన్సీ పల్లెల్లో ఎమర్జెన్సీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని,మెరుగైన వైద్యం అందించాలని కోరారు.చర్ల మండల కేంద్రంలోని మొగలపల్లి గ్రామపంచాయతీలోని ఆనంద్ కాలనీ గ్రామంలో అనేక మంది విషజ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీ లోని ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సత్యనారాయణపురం గ్రామపంచాయతీలోని ప్రజలు కూడా డెంగ్యూ జ్వరాలతో నానా అగచాట్లు పడుతున్నారని అన్నారు.పెద్దపల్లి ప్రజలు కూడా విష జ్వరాలతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రైవేటు వైద్యం కోసం పట్టణాలకు పరిగెడుతున్నారని ఆవేదన వ్యక్తం.కొత్త పెళ్లి గ్రామంలో చిన్న ముసిలేరు గ్రామంలో కనీసం 25 సంవత్సరాల వయసు పూర్తికాని యువకులు చర్ల ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందక దగ్గర్లో ఉన్న భద్రాచలం పట్టణ కేంద్రానికి వెళ్లి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కొరకు లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం పొందిన ఈ ప్రాంతంలోని గిరిజన బిడ్డ ప్రాణాలు దక్కలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.చనిపోయిన గిరిజన,దళిత కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని,చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇకనైనా చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలుగా తీర్చిదిద్ది సీనియర్ డాక్టర్లను నియామకం చేపట్టి ఈ మూడు ప్రభుత్వ వైద్యశాలల నందు పూర్తిస్థాయి సీనియర్ వైద్య సిబ్బందిని నియమించి,అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించి ఏజెన్సీలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !