+91 95819 05907

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి కామారెడ్డి జూన్ 6:

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును చోరీ చేసిన సంఘటన దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.దేవునిపల్లి ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మంచాల సత్తవ్వ అనే మహిళ కామారెడ్డి లోని ఎస్బిఐ బ్యాంకులో నుంచి తన అవసరం నిమిత్తం 2000 రూపాయలను డ్రా చేసుకొని నడుచుకుంటూ వెళుతుండగా మార్గమధ్యలో జీవధాన్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తారసపడి సదరు మహిళతో ముచ్చట కలిపాడు.దొంగలు తిరుగుతున్నారని,మెడలో అలా బంగారు గొలుసు వేసుకొని వెళ్లవద్దని నమ్మబలికాడు. మెడలో నుంచి బంగారు గొలుసు తీసివేసి పర్సులో పెట్టుకొని వెళ్లాలని సదరు వ్యక్తి మహిళ కు సూచించాడు.ఇది నమ్మిన మహిళ మూడు తులాల బంగారు గొలుసులు మెడలో నుంచి తీసి పర్సులో పెట్టే ప్రయత్నం చేస్తుండగా అలా కాదు అంటూ టవల్ లో చుట్టి పర్సులో పెట్టుకోవాలని సూచిస్తూ మెళ్లిగా ఆమెకు తెలియకుండానే గొలుసును తస్కరించి వెళ్లిపోయాడు.
జీవధాన్ ఆసుపత్రి దాటాక అనుమానం వచ్చిన సదరు మహిళ పర్సు చూసుకోగా అందులో బంగారు గొలుసు లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ

Read More »

అశ్వారావుపేట గడ్డపై గులాబీ జెండా రెపరెప.. కాంగ్రెస్ ‘గడీల’ పాలనకు కాలం చెల్లింది!

​బెదిరింపులకు భయపడం.. 13వ వార్డులో సంకుల స్వరూప గెలుపు ఏకపక్షమే: బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ గర్జన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 06: భద్రాద్రి కొత్తగూడెం

Read More »

అశ్వారావుపేటలో గులాబీ దండు ‘గర్జన’.. 14వ వార్డులో భుక్య ఉదయజ్యోతి గెలుపే లక్ష్యం!

​అమలుకాని హామీలిచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి: జిల్లా బీఆర్ఎస్ నేత సోయం వీరభద్రం పిలుపు నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి 6: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

Read More »

గుండాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఓ ఎస్ డి, ఎన్,నరేందర్

** *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల పోలీస్ స్టేషన్ ను కొత్తగూడెం ఓ ఎస్ డి ఎన్, నరేందర్ సందర్శించారు. సందర్శించిన ఆయన స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కన, స్టేషన్ డైరీ, స్టేషన్లోని

Read More »

సింథటిక్ ట్రాక్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలన.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో 8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్

Read More »

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే

Read More »

 Don't Miss this News !