+91 95819 05907

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి కామారెడ్డి జూన్ 6:

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును చోరీ చేసిన సంఘటన దేవుని పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.దేవునిపల్లి ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మంచాల సత్తవ్వ అనే మహిళ కామారెడ్డి లోని ఎస్బిఐ బ్యాంకులో నుంచి తన అవసరం నిమిత్తం 2000 రూపాయలను డ్రా చేసుకొని నడుచుకుంటూ వెళుతుండగా మార్గమధ్యలో జీవధాన్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి తారసపడి సదరు మహిళతో ముచ్చట కలిపాడు.దొంగలు తిరుగుతున్నారని,మెడలో అలా బంగారు గొలుసు వేసుకొని వెళ్లవద్దని నమ్మబలికాడు. మెడలో నుంచి బంగారు గొలుసు తీసివేసి పర్సులో పెట్టుకొని వెళ్లాలని సదరు వ్యక్తి మహిళ కు సూచించాడు.ఇది నమ్మిన మహిళ మూడు తులాల బంగారు గొలుసులు మెడలో నుంచి తీసి పర్సులో పెట్టే ప్రయత్నం చేస్తుండగా అలా కాదు అంటూ టవల్ లో చుట్టి పర్సులో పెట్టుకోవాలని సూచిస్తూ మెళ్లిగా ఆమెకు తెలియకుండానే గొలుసును తస్కరించి వెళ్లిపోయాడు.
జీవధాన్ ఆసుపత్రి దాటాక అనుమానం వచ్చిన సదరు మహిళ పర్సు చూసుకోగా అందులో బంగారు గొలుసు లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !