+91 95819 05907

ఆదివాసీ గ్రామాల అభివృద్ధి కి PESA కమిటీలు పనిచెయ్యాలి : ITDA PESA కోఆర్డినేటర్ కోమరం ప్రభాకర్,

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 06):

అఖినేపల్లిమల్లారం (మంగపేట ) ఈ రోజు మంగపేట మండలం లోని 25 గ్రామ పంచాయతీ లో గల 49 PESA గ్రామ సభల అభివృద్ధి కి PESA కమిటీలు పనిచేయాలని కొమురం ప్రభాకర్ కోరారు.PESA కమిటీ ములుగు జిల్లా అధ్యక్షులు డబ్బుల ముత్యాలరావు అధ్యక్షతన ఈ సమావేశం అఖినేపల్లి మల్లారం లో నిర్వహించడం జరిగిందన్నారు. గిరిజన గ్రామాలలో గల వనరులను ఉపయోగించుకొని ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలను గ్రామ సభల ద్వారా గిరిజనులకు దరిచేరే విధంగా PESA కమిటీలు పనిచేయాలన్నారు. గ్రామాలలో గల కుల పెద్దలు, యువకులు, డ్వాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు PESA గ్రామ సభలు భలోపేతం చేయుటకు కృషి చేయాలన్నారు. ప్రతి PESA మొబిలైజర్ వద్ద గ్రామం, గ్రామ పంచాయతీ కి సంబందించిన సమాచారం ( జనాభా, వృద్దులు, , వ్యవసాయం) ఉండాలన్నారు. ఏజెన్సీ గ్రామాలలో ఒక ప్రాజెక్టు కట్టాలన్న PESA గ్రామ సభలను సంప్రదించాలని చట్టం లో పొందు పర్చబడ్డదన్నారు. 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం -2006, షెడ్యూల్డ్ ప్రాంత పాలన – రాజ్యాంగ నియమాల గురించి PESA కమిటీలకు అవగాహన చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో ఆదివాసీ హక్కుల ఉద్యమ కర్త గొప్ప వీరయ్య, PESA కమిటీ జిల్లా అధ్యక్షులు డబ్బుల ముత్యాల రావు, ఆదివాసీ కుల పెద్దలు బండ్ల ముత్యాపూరావు, అప్పినబోయిన నర్సింహామూర్తి మాజీ సర్పంచ్, గొప్ప చంద్రకాంత్,25 గ్రామ పంచాయతీ ల మొబిలైజర్లు, 49 గ్రామ సభల ఉపాధ్యక్షులు/ కార్యదర్షులు పూసం కార్తీక్, జోగ నరేంద్ర, తాటి విజయ్, జీగట శ్రీను, ఏటూరునాగారం PESA కమిటీ అధ్యక్షులు పాయం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య

అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో సుమారు రెండున్నర ఎకరాల

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ అశ్వారావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు –రెవెన్యూ, పోలీసుల సంయుక్త చర్య నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్

Read More »

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్

అశ్వారావుపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై బిఆర్ఎస్ ఫైర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్య దుర్మార్గం; నిరాశ్రయులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

Read More »

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి * ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుందని

Read More »

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!

ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే! నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా

Read More »

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారం పూర్తి చేయాలి… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి. తిరస్కరించే ప్రతి దరఖాస్తుకు కారణాలతో రిపోర్ట్ ఉండాలి. నేటి గదర్ న్యూస్, ఖమ్మంజిల్లా ప్రతినిధి, సతీష్కుమార్జినుగు. నిబంధనల ప్రకారం

Read More »

 Don't Miss this News !