+91 95819 05907

ఓసి-2 నూతన కార్యాలయం కే పి యు జి ప్రధాన రహదారి రైల్వే అండర్ బ్రిడ్జి వరద నీరు మళ్లించాలి

నేటి గదర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి,మణుగూరు (జూన్ 06)

ఓసి-2 నూతన కార్యాలయం మరియు కే పి యు జి ప్రధాన రహదారి రైల్వే అండర్ బ్రిడ్జి వరద నీరు మళ్లించాలి లేదా ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనీ కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మణుగూరు ఏరియా ఇన్ చార్జ్ జిఎం తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ గారికి వినతి పత్రం అందజేసినట్లు గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీకే ఓ సి సెక్షన్-2 నూతన క్షేత్ర కార్యాలయం (సైట్ ఆఫీస్)కొండాపురం భూగర్భ గని మరియు దుర్గా-2 ఓబీ కంపెనీ కి వెళ్లే ప్రధాన రహదారి కి సంబంధించి మార్గమధ్యంలో ఏరియా వర్క్ షాప్ సమీపంలో సింగరేణి రైల్వే అండర్ బ్రిడ్జి నుండి కార్మికులు అధికారులు ఇతరులు కూడా ప్రయాణించాల్సి ఉందనీ వర్షాకాలంలో ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నుండి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించే కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, జూన్ రెండవ తేదీ రాత్రి భారీ వర్షానికి కూడా ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు, వర్షం తగ్గిన తర్వాత మార్గమంతా బురద మాయం అవుతుందని మండల పరిధిలోని గిరిజన గ్రామాలైన బుగ్గ ఖమ్మం తోగు, బుడుగుల ప్రజలు కూడా ఈ బ్రిడ్జి కింద నుంచి ప్రయాణిస్తున్నారన్నారు,ఈ నేపద్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి నుండి వరద నీరు మళ్లింపుకు చర్యలు చేపట్టడమా లేక ప్రత్యామ్నాయంగా కొండాపురం సి ఎస్ పి నుండి, అవకాశం ఉంటే కూనవరం రైల్వే గేట్ పక్కనుండి నూతన రోడ్డు నిర్మాణం చేసి ప్రయాణించే విధంగా దారి మళ్లించడమా అనే అంశంపై మణుగూరు ఏరియా సింగరేణి యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు, ఇన్ ఛార్జ్ జిఎం లక్ష్మీపతి గౌడ్ గారు సానుకూలంగా స్పందించారని త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని తెలిపారున్నారు ఈ కార్యక్రమంలో ఏ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !