యు.పి.ఎస్ కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 7:
నైనారపు నాగేశ్వరరావు✍️
మణుగూరు మండల కేంద్రంలోని కూనవరం లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో రెండవ రోజు జూన్ 7న ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ ఆధ్వర్యంలో టీచర్స్ టీం కూనవరం గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు.కరపత్రాల పంచుతూ, విద్యార్థినీ,విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ,నినాదాలు చేస్తూ,ర్యాలీ నిర్వహించరు.తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించారు. తొలుత కూనవరం నుండి అంగన్వాడి కేంద్రంను సందర్శించి బడి ఈడు గల విద్యార్థుల యొక్క వివరాలను నమోదు చేసుకున్నారు.తరువాత విద్యార్థుల యొక్క ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఒకటవ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నారు.అదే విధంగా ఏడవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సమీప జిల్లా పరిషత్ కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల మణుగూరులో జాయిన్ కావలసిందిగా తల్లిదండ్రులను కోరారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు టాయిలెట్స్ సౌకర్యం,విద్యుత్తు సౌకర్యాలను కల్పిస్తుందని ఆయన తెలిపారు. సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం మరియు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు.సామాజిక బాధ్యతగా అందరూ సర్కారు బడులలో విద్యార్థినీ,విద్యార్థులను పెంచుటలో భాగస్వామ్యం అయ్యి ప్రభుత్వ బడులను రక్షించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఏనిక ప్రమీల మరియు సభ్యులు,టీచర్ సారయ్య, హై స్కూల్ టీచర్లు ఆదినారాయణ, రత్నకుమార్,కృష్ణకుమారి,ఛాయాదేవి,క్లస్టర్ హెల్త్ ఆఫీసర్ లక్ష్మి,అంగన్వాడి టీచర్ వీరకుమారి,ఆయా శశిరేఖ మరియు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.