+91 95819 05907

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి…

యు.పి.ఎస్ కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 7:
నైనారపు నాగేశ్వరరావు✍️

మణుగూరు మండల కేంద్రంలోని కూనవరం లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో రెండవ రోజు జూన్ 7న ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ ఆధ్వర్యంలో టీచర్స్ టీం కూనవరం గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు.కరపత్రాల పంచుతూ, విద్యార్థినీ,విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ,నినాదాలు చేస్తూ,ర్యాలీ నిర్వహించరు.తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించారు. తొలుత కూనవరం నుండి అంగన్వాడి కేంద్రంను సందర్శించి బడి ఈడు గల విద్యార్థుల యొక్క వివరాలను నమోదు చేసుకున్నారు.తరువాత విద్యార్థుల యొక్క ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఒకటవ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నారు.అదే విధంగా ఏడవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సమీప జిల్లా పరిషత్ కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల మణుగూరులో జాయిన్ కావలసిందిగా తల్లిదండ్రులను కోరారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు టాయిలెట్స్ సౌకర్యం,విద్యుత్తు సౌకర్యాలను కల్పిస్తుందని ఆయన తెలిపారు. సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం మరియు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు.సామాజిక బాధ్యతగా అందరూ సర్కారు బడులలో విద్యార్థినీ,విద్యార్థులను పెంచుటలో భాగస్వామ్యం అయ్యి ప్రభుత్వ బడులను రక్షించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఏనిక ప్రమీల మరియు సభ్యులు,టీచర్ సారయ్య, హై స్కూల్ టీచర్లు ఆదినారాయణ, రత్నకుమార్,కృష్ణకుమారి,ఛాయాదేవి,క్లస్టర్ హెల్త్ ఆఫీసర్ లక్ష్మి,అంగన్వాడి టీచర్ వీరకుమారి,ఆయా శశిరేఖ మరియు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !