+91 95819 05907

రామోజీ రావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపిన జర్నలిస్ట్ పూనేం సుమంత్

నేటి గద్ధర్ న్యూస్,కారేపల్లి:

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల మండల జర్నలిస్ట్ పూనేం సుమంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారని తెలిపారు. రామోజీ రావు సినిమా రంగంలో, పత్రికా రంగంలో ప్రత్యేక ఒరవడిని తీసుకువచ్చారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన రామోజీ ఫిలిమ్ సిటీ విశ్వవ్యాప్తం అయిందని గుర్తు చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిచ్చారని కొనియాడారు. సమాజ అభ్యున్నతి కోసం అనుక్షణం పనిచేశారాని, ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి మండలం నుంచి ఒకరో ఇద్దరో రామోజీరావు సంస్థలో పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సక్సెస్ కు మారుపేరు రామోజీరావు . అన్నదాత పత్రిక ద్వారా రైతులకు కొత్త సాంకేతిక విధానం తెలిసేలా చేశారు. మార్గదర్శి ప్రియా పచ్చళ్ళు ద్వారా అనేకమందికి ఉపాధి కల్పించారు. రామోజీ ఫిలిం సిటీ ని స్థాపించి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి గడించేలా చేశారు. ఎవరు ఎన్ని దాడులు చేయాలని చూసినా సంస్థలని మూసివేయాలని చూసినా తనదైన శైలిలో ముందుకు నడిచారు. అటువంటి మహనీయునికి శోక నివాళి అర్పించారు. రామోజీ రావు లాంటి గొప్ప వ్యాపారావేత్తను కోల్పోవడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !