+91 95819 05907

రామోజీ రావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపిన జర్నలిస్ట్ పూనేం సుమంత్

నేటి గద్ధర్ న్యూస్,కారేపల్లి:

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల మండల జర్నలిస్ట్ పూనేం సుమంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారని తెలిపారు. రామోజీ రావు సినిమా రంగంలో, పత్రికా రంగంలో ప్రత్యేక ఒరవడిని తీసుకువచ్చారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన రామోజీ ఫిలిమ్ సిటీ విశ్వవ్యాప్తం అయిందని గుర్తు చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిచ్చారని కొనియాడారు. సమాజ అభ్యున్నతి కోసం అనుక్షణం పనిచేశారాని, ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి మండలం నుంచి ఒకరో ఇద్దరో రామోజీరావు సంస్థలో పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సక్సెస్ కు మారుపేరు రామోజీరావు . అన్నదాత పత్రిక ద్వారా రైతులకు కొత్త సాంకేతిక విధానం తెలిసేలా చేశారు. మార్గదర్శి ప్రియా పచ్చళ్ళు ద్వారా అనేకమందికి ఉపాధి కల్పించారు. రామోజీ ఫిలిం సిటీ ని స్థాపించి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి గడించేలా చేశారు. ఎవరు ఎన్ని దాడులు చేయాలని చూసినా సంస్థలని మూసివేయాలని చూసినా తనదైన శైలిలో ముందుకు నడిచారు. అటువంటి మహనీయునికి శోక నివాళి అర్పించారు. రామోజీ రావు లాంటి గొప్ప వ్యాపారావేత్తను కోల్పోవడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !