*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన *
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4.
ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాదిగలకు దరిద్రం ధారణంగా దాపరించిందన్నారు
అధిష్టానాన్ని ఒప్పించి మాదిగలకు రాజ్యసభ వచ్చేలా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదే. అని అన్నారుతెలంగాణ నుండి రాజ్యసభ సీట్లలో ఒక సీటు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు మెదక్ జిల్లా లో కాంగ్రెస్ క్యాంపు కార్యాలయం వద్ద మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు దండోల సామేలు పాతూరి రాజు మెదక్ మండల అధ్యక్షులు చెవిటి గట్టయ్య మాల మహానాడు డి పి ఎఫ్ నాయకులు సంజీవులు బొమ్మ మైసయ్య తదితరులు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి ప్రస్తుతం భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ మాదిగలకు ఒక స్థానం ఇవ్వాలని , గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా మాదిగలకు మొసం చేయడం జరిగింది. అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని పలుగురు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుండి మాదిగలకు పార్లమెంట్ లో రాజకీయ ప్రాతినిధ్య లేకుండా కుట్రలు చేస్తుందని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ నుండి పార్లమెంట్ లో ఒసిలకు, బీసీలకు, ఎస్టీలకు అలాగే ఎస్సీలలో మాలలకు ప్రాతినిధ్యం ఉందని అన్నారు .కానీ ప్రాతినిధ్యం లేని కులం మాదిగలు మాత్రమే అని అన్నారు. ఇప్పటికే రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగి ఉన్న రెడ్డి,బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే బదులు అసలే రాజకీయ ప్రాతినిధ్యం లేని మాదిగలకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు.
అలాగే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏకకాలంలో టీడీపీలో తెలంగాణ నుండి ఇద్దరు మాదిగలు లోక్ సభ లో ఉన్నారు.అందులో ఒకరు మంద జగన్నాథం మరొకరు సుగుణ కుమారి.అదే సమయంలో టీడీపీ నుండి మరొకరు రాజ్యసభలో మాదిగ సామాజిక వర్గం నుండి ఆకారపు సుదర్శన్ ఉన్నారు.
కానీ రేవంత్ రెడ్డి కాలంలో మాదిగలు లోక్ సభలో, రాజ్యసభలోను ఒక్కరు కూడా లేకుండా పోయారని అన్నారు
ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలపై చూపుతున్న చొరవ ముమ్మాటికి అణిచివేత వివక్ష పండి వైఖరి విరమించుకోవాలని అన్నారు
మాదిగ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నాడని అనుకోవాలని మాదిగలకు గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం మాదిగ జాతిపై సవతి ప్రేమను చూపుతున్నాడని అన్నారు.
మొన్న 5 శాసనమండలి స్థానాలు భర్తీ అయితే అందులో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలేదు అని అన్నారు.
కనుక ఇప్పుడు చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ప్రస్తుతం భర్తీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయించే విధంగా అధిష్టానాన్ని ఒప్పించి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే ఉందని అన్నారు.
రాజ్యసభలో రెడ్డిలకు ప్రాతినిధ్యం ఉన్న తర్వాత కూడా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చూడడం రెడ్ల పాలన నియంతృత్వనికి పరాకాష్టగా మారుతుందని అన్నారు.
రాజ్యసభ స్థానాల్లో మాదిగలకు న్యాయం జరిగే వరకు మంద కృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు అవసరమనుకుంటే ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో రాష్ట్ర జిల్లాల వ్యాప్తంగా నిరసన ఆందోళనలు చేపడతామని అన్నారు.
అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ అధికార ప్రతినిది మన్నెల సుధాకర్ , జిల్లా కార్యదర్శి పరమేష్ మాదిగ , ఎంఎస్పి జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.








