*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు*
నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులను గురువారం పట్టుకొని రిమాండుకు తరలిస్తున్నట్టు ఎడుళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు. CI తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అశ్వాపురం పాడు గ్రామానికి చెందిన 1)వజ్జా భీమరాజు
2) మడివి మంగయ్య
3) మడివి నందయ్య
4) వంక భీమరాజ్ ట్రాక్టరు డ్రైవర్,జగ్గారం గ్రామం దమ్మపేట మండలం
5)మడకం లక్ష్మయ్య తాపీ మేస్త్రీ తిరుమలకుంట గ్రామం అశ్వారావుపేట మండలం అర్ఓ బూర్గంపాడు మండలం తాళ్లగుమ్మూరు గ్రామం ఇందులో మొదట ముగ్గురు వ్యక్తులు అశ్వాపురం పాడు గ్రామానికి చెందిన కోవాసి వెంకటేశ్వర్లకి మధ్య కొంతకాలంగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయి మొదటి వ్యక్తి వజ్జా భీమరాజు కొన్ని రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులతో ఘర్షణ కాగా ఆ కేసులో అతను అతని భార్య ఇద్దరు భద్రాచలం జైలుకు వెళ్లారు అని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి భీమరాజుకు అతని భార్యకు బెయిలు పెట్టకుండా అడ్డుకున్నందుకు మూడవ వ్యక్తి మడివి నందయ్య బెయిల్ పెట్టినందుకు అతన్ని ఊరి నుండి వెళ్లగొడతానని బెదిరించడం అలాగే రెండవ వ్యక్తి మడివి మంగయ్య వ్యక్తి కుటుంబ విషయంలో తలదూర్చి అతనిని అతని భార్యని అంతేకాకుండా మరొక భార్యను కూడా విడగొట్టి పంపాలని చూస్తున్నాడని భావించి మృతుడు కోవాసి వెంకటేశ్వర్లు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని అతనిని అడ్డు తొలగించుకుందామని మొదటి వ్యక్తి అయిన భీమరాజు అతను ఫారెస్ట్ కేసు విషయంలో జైలుకు వెళ్లినప్పుడు పరిచయం అయిన బాలాజీకి పేరు ముగ్గురు కొంత డబ్బు పోగు చేసి అతనికి 50 వేల రూపాయలు ఇస్తాము వెంకటేశ్వర్లని చంపడానికి సహాయం కావాలని చెప్పగా అతను ఒప్పుకొని అతను అతని స్నేహితుడు అయిన మడకం లక్ష్మయ్యను తీసుకొని ఫిబ్రవరి 27వ తారీఖున అందరూ కలిసి పథకం ప్రకారం పడుకోని ఉన్న కోవాసి వెంకటేశ్వర్లను ఫిబ్రవరి 28వ తారీకు అర్ధరాత్రి పడుకొని ఉన్న కోవాసి వెంకటేశ్వర్లను గొడ్డలితో నరికి అక్కడి నుండి వెళ్ళిపోగా ఎడుళ్ళ బయ్యారం సీఐ కేసును దర్యాప్తు చేస్తూ గురువారం ఐదుగురు వ్యక్తులను రెస్ట్ చేసి అతని చంపడానికి ఉపయోగించిన గొడ్డలి చంపినప్పుడు అంటిన రక్తపు మరకల దుస్తులను,బాలాజీ ,
లక్ష్మయ్య లు అశ్వాపురం పాడు గ్రామ రావడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరచుకొని రిమాండ్ కి తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్ఐ పివి నాగేశ్వరరావు, ఎడుళ్ళ బయ్యారం ఎస్ఐ సురేష్ పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.









