+91 95819 05907

బస్సు ఆపడానికి వెళ్లిన ప్రయాణికుడి పై దాడినా..?

★ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ యాక్షన్…

★బస్సు లేక అవస్థలు పడుతున్న ప్రజలు…

★ప్రయాణికులకు సరిపడా లేని ఆర్టీసీ బస్సులు…

★ఓక్కో బస్సులో 120 మందికి పైగా ప్రయాణం…

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు✍️

బస్సు ఆపడానికి వెళ్లిన ఓ ప్రయాణికుడిపై షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో పని చేసే డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు.చాలా సేపటి నుండి బస్సు కోసం విసిగి వేసారిన జనాలు ఒక్కసారిగా బస్సు రావడంతో బస్సు దగ్గరికి వెళ్లారు.సమయపాలన అడిగి బస్సు ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్ ను అడగడంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ ప్రయాణికుడుపై దాడికి పాల్పడ్డాడు.ఇప్పటికే ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఒక్కో బస్సులో 55 మంది ప్రయాణికులు ప్రయాణం చేయాల్సి ఉండగా 120 మంది వరకు ప్రయాణికులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం ఒకటైతే సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.ఇక రాత్రి 8గంటల 30 నిమిషాల నుండి అర్ధరాత్రి అయినా షాద్ నగర్ కు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ప్రయాణాన్ని కొనసాగించకపోవడంతో అటు బైపాస్ లో పోయే బస్సులు కూడా బైపాస్ లో ఆపకపోవడంతో అసలు షాద్ నగర్ ప్రజలు చేసుకున్న పాపమేంటని మండిపడుతున్నారు.షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలు దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ ను వివరణ కోరగా దాడి జరిగింది. వాస్తవమేనని ఆ డ్రైవర్ ను పిలిపించి మాట్లాడుతానని చెప్పడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.ఇక డిపోలో సరిపడా బస్సులు లేవని ఇప్పటికే పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ చెప్పుకొచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !