+91 95819 05907

బస్సు ఆపడానికి వెళ్లిన ప్రయాణికుడి పై దాడినా..?

★ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ యాక్షన్…

★బస్సు లేక అవస్థలు పడుతున్న ప్రజలు…

★ప్రయాణికులకు సరిపడా లేని ఆర్టీసీ బస్సులు…

★ఓక్కో బస్సులో 120 మందికి పైగా ప్రయాణం…

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు✍️

బస్సు ఆపడానికి వెళ్లిన ఓ ప్రయాణికుడిపై షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో పని చేసే డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు.చాలా సేపటి నుండి బస్సు కోసం విసిగి వేసారిన జనాలు ఒక్కసారిగా బస్సు రావడంతో బస్సు దగ్గరికి వెళ్లారు.సమయపాలన అడిగి బస్సు ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్ ను అడగడంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ ప్రయాణికుడుపై దాడికి పాల్పడ్డాడు.ఇప్పటికే ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఒక్కో బస్సులో 55 మంది ప్రయాణికులు ప్రయాణం చేయాల్సి ఉండగా 120 మంది వరకు ప్రయాణికులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం ఒకటైతే సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.ఇక రాత్రి 8గంటల 30 నిమిషాల నుండి అర్ధరాత్రి అయినా షాద్ నగర్ కు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ప్రయాణాన్ని కొనసాగించకపోవడంతో అటు బైపాస్ లో పోయే బస్సులు కూడా బైపాస్ లో ఆపకపోవడంతో అసలు షాద్ నగర్ ప్రజలు చేసుకున్న పాపమేంటని మండిపడుతున్నారు.షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలు దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ ను వివరణ కోరగా దాడి జరిగింది. వాస్తవమేనని ఆ డ్రైవర్ ను పిలిపించి మాట్లాడుతానని చెప్పడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.ఇక డిపోలో సరిపడా బస్సులు లేవని ఇప్పటికే పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ చెప్పుకొచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

పాఠశాలలో ఎమ్మెల్యే జారె ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో ముఖాముఖి

​లింగాలపల్లి ప్రభుత్వ బడిలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన జారె ఆదినారాయణ నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి), మార్చ్, 02: ​దమ్మపేట మండలం, లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే జారె

Read More »

సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులను కలిగించకుండా జరుపుకోవాలి* *బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు* *ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు* హోళీ పండుగ సందర్భంగా జిల్లా

Read More »

 Don't Miss this News !