+91 95819 05907

లయన్స్ క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయం:Mla

★పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు ✍️

మణుగూరులోని స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు అధ్యక్షతన లైన్స్ క్లబ్ 30వ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. లయన్స్ క్లబ్ మణుగూరు 30వ ప్రెసిడెంట్ గా నల్లగట్ల సత్య ప్రకాష్,సెక్రటరీ షేక్ మీరా హుస్సేన్,ట్రెజరర్ ఎం శ్రీనివాసరావులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ,లయన్స్ క్లబ్ మణుగూరు ఆపదలో ఉన్నవారికి చేస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని అన్నారు. పర్యావరణం,విద్య, వైద్యంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని అన్నారు.నూతన ప్రెసిడెంట్ సత్య ప్రకాష్ నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరి అభిమానాన్ని పొందాలన్నారు. లయన్స్ క్లబ్ కు ఆర్థిక,హార్దిక సహాయ సహకారాలు అందిస్తున్న చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబును అభినందించారు.ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ సిహెచ్ వి శివప్రసాద్ మాట్లాడుతూ, మణుగూరు లయన్స్ క్లబ్ 460 సామాజిక సేవ చైతన్య కార్యక్రమాలు చేసి ఫస్ట్ బెస్ట్ ప్రెసిడెంట్,ఫస్ట్ బెస్ట్ సెక్రెటరీ, తాడ్ బెస్ట్ ట్రెజరర్ గా జోన్ మరియు రీజియన్ స్థాయిలలో అవార్డులు అందుకున్నారని, జిల్లాలో కూడా మూడవ స్థానంలో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు.జీవితంలో నిజమైన ఆత్మసంతృప్తి సేవ ద్వారా మాత్రమే లభిస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు,ఎలెక్ట్ ప్రెసిడెంట్,నల్లగట్ల సత్య ప్రకాష్, సెక్రటరీ షేక్ మీరా హుస్సేన్, ట్రెజరర్ ఆడబల నాగేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు,ప్రోగ్రాం చైర్ పర్సన్ పిల్లారిశెట్టి హరిబాబు,కో చైర్ పర్సన్ ఎం నాగేశ్వరరావు, ఆర్ సి గబ్బేట రాజయ్య,జెడ్ సి.వి. కృష్ణమోహన్,జెడ్ సి డెసిగ్నేట్ భూక్య ప్రసాద్,ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ కాప మురళి కృష్ణ,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య,క్లబ్ సభ్యులు డాక్టర్ గాజుల కోటేశ్వరరావు,గూడవల్లి లక్ష్మణరావు,గాజుల రమేష్, దండ రాధాకృష్ణ,దుగ్గి సతీష్ కుమార్,కముజు చంద్రమోహన్, బేతంచర్ల వెంకటేశ్వర్లు,డాక్టర్ సమ్మయ్య,చింతపల్లి రాంబాబు, భాగం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !