+91 95819 05907

ఆదివాసి గిరిజన గ్రామాల కు మౌలిక సౌకర్యాలు కల్పించాలని

★ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేత…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 11:

పినపాక నియోజకవర్గం పరిధిలోని గిరిజన ఆదివాసి గ్రామాల మౌలిక సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు)ఆధ్వర్యంలో మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ డి నాసర్ పాషా మాట్లాడుతూ,పినపాక నియోజకవర్గ పరిధిలోని మణుగూరు,అశ్వాపురం, పినపాక మండలాల్లోని ఆదివాసి గిరిజన గ్రామాలైన బుగ్గ,ఖమ్మం తోగు,బుడుగుల, రేగుల గండి,రాయన్నపేట,సర్వాయి గుంపు, పెద్దిపల్లి,విప్పల గుంపు,కుమ్మరి గుంపు, మనుబోతుల గూడెం,మామిళ్ళవాయి, గుండ్ల సాగర్,బండ్ల గుంపు,వెంకటాపురం, పిట్టతోగు,రేగళ్ల,సుందరయ్యనగర్,ఉమేష్ చంద్రనగర్,ఎస్టి కాలనీ గుంపు,వేగులూరు, సీతానగర్ తదితర ఆదివాసి గిరిజన గ్రామాలలో రహదారి సౌకర్యం,విద్యుత్ సౌకర్యం,త్రాగునీటి సౌకర్యం లేక ఆదివాసీలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రహదారి లేక ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని,కొన్ని గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు కూడా లేవని అన్నారు.ఏనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆదివాసీలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.ఎన్నికల కోడ్ కూడా ముగిసింది కనుక పైన తెలిపిన ఆదివాసి గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు.అదే విధంగా వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆదివాసి గూడేలలో ముందస్తు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రభుత్వం ఉచిత దోమ తెరల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని, మణుగూరు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి ఏర్పాట్లు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్ పలువురు ఆదివాసీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !