+91 95819 05907

Good news:సింగరేణి వారసత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు.

..

సర్క్యులర్ విడుదలపై ఐ ఎన్ టి యు సి నాయకుల హర్షం…

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన:INTUC,SCML నాయకులు.

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 11:
నైనారపు నాగేశ్వరరావు ✍️

సింగరేణి వారసత్వ ఉద్యోగుల నియామక వయో పరిమితి 35 నుండి 40 ఏళ్లకు పెంపు సర్క్యులర్ ఆదేశాలు విడుదలపై సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి)మణుగూరు ఏరియా బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య యాదవ్ లు హర్షం వ్యక్తం చేశారు.పీవీ కాలనీ ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో మంగళ వారం నాడు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క,సింగరేణి సిఎండి బలరాం నాయక్ (ఐఆర్ఎస్) మరియు ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి జనక్ ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.సింగరేణి కార్మిక గుర్తింపు ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు.ఈ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరినట్లుగా వారు అభివర్ణించారు.35 ఏళ్లకు వయసు పైబడి ఉద్యోగాలు రావని నిరాశ,నిస్పృహలతో ఉన్న డిపెండెంట్ లకు 40 ఏళ్లకు వయోపరిమితి పెంపు సర్క్యులర్ ఎంతగానో లబ్ధిచేకూరనుందని అభిప్రాయపడ్డారు.ఈ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాద్ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన 441 మంది సింగరేణి నూతన ఉద్యోగుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సందర్భంగా తమ నాయకులు బి జనక్ ప్రసాద్ వయోపరిమితి అంశాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తు రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళటం జరిగిందన్నారు.అనంతరం స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి బట్టి విక్రమార్క చర్చించి అదే వేదికపై సింగరేణి ఉద్యోగులపై ఉన్న ప్రత్యేక అభిమానంతో మా ప్రభుత్వం వయోపరిమితి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని సభికుల హర్షద్వారాల మధ్య ప్రకటించడంతో పాటు దీనిపై సర్క్యులర్ విడుదల చేయాలని అక్కడికక్కడే సింగరేణి సిఎండి ఎం బలరాం కూడా ఆదేశాలు జారీ చేశారు.ఆ విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు,ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని కోడ్ ఎత్తి వేసిన వెంటనే సర్క్యులర్ జారీ అయిందని ఆయన తెలిపారు.వీలైనంత త్వరగా కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని ఎలాంటి షరతులు లేకుండా,కొర్రి పెట్టకుండా వయోపరిమితి పెంపు సర్క్యులర్ అమలు చేయాలని ఆయన సింగరేణి అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు వత్సవాయి కృష్ణంరాజు ,
సిల్వేరు గట్టయ్య యాదవ్,సూరపాక రాములు,షేక్ మస్తాన్,మిద్దెపాక శ్రీనివాస్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !