+91 95819 05907

కామ్రేడ్ రాదక్క మరణం విప్లవోద్యమానికి తీరని లోటు

– విప్లవోద్యమ నాయకురాలికి నివాళి CPI(ML)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు

నేటి గదర్, జూన్ 11,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
అలవాల వంశీ 9052354516

సిపిఐ ఎంఎల్ ప్రతిఘటనోద్యమ నాయకురాలు కామ్రేడ్ రాదక్క మరణం విప్లవోద్యమానికి తీరని లోటు అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. ప్రముఖ ప్రతిఘటనోద్యమ, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ రాధక్క అలియాస్ నిర్మలక్క (86) మంగళవారం ఉదయం 9 గంటలకు హైదరాబాదులో మరణించారని అన్నారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, ఆమె కుమార్తె ఇంటి వద్ద ఉంటూ వైద్య చికిత్సను పొందుతున్నారని తెలిపారు. ఆమె పార్థీవ దేహం సింగరేణి కాలనీలో కుమార్తె  ఇంటి వద్ద ఉన్నదని, ఆమె అంత్యక్రియలు 13వ తేదీ  గురువారం ఉదయం జరుగుతాయని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో  సిపిఐ( ఎం.ఎల్) చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పనిచేశారని గుర్తు చేశారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో ఆమె ప్రముఖ పాత్ర వహించారన్నారు. కడదాకా పీడిత ప్రజల ఉద్యమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటు సుదీర్ఘకాలం అజ్ఞాతవాసంలో గడిపారని వెల్లడించారు. అతివాద, మితవాదాలకి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేశారని, విప్లవోద్యమంలో ఆమె వివిధ బాధ్యతలు వహించారన్నారు. విప్లవఉద్యమంలో కొంతకాలం  జైలు జీవితం కూడా గడిపారని అన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయంతీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పదోతరగతి విద్యార్థిని రాసిన పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన గీతిక అనే పదో తరగతి విద్యార్థినికి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె ఏడో తరగతి నుంచి

Read More »

దూలుగొండ తల్లి జాతర క్రీడలకు వాలీబాల్స్ అందజేత: మానాల బ్రదర్స్

*ఈసం వంశీలకు బాల్స్ నెట్లను అందించిన మానాల బ్రదర్స్* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలం పరిధిలోని రోల్లగడ్డ గ్రామంలో జరిగే ఈసం వంశీల మహా జాతర అయిన దోనుకొండ తల్లి జాతరకు మండల

Read More »

“ఫ్రీ పాలస్తీనా” పేరుతో రూ. 5 కోట్ల కుంభకోణం?

మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అయాన్, జైద్ నోటియార్ మరియు అబు సుఫియాన్‌లు. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వివిద ఖాతాలు మరియు గ్రూపులను సృష్టించారు. పాలస్తీనాలోని మహిళలు మరియు

Read More »

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు

నాన్న ఎప్పుడూ అడిగేవాడు..ఊర్లో పొలం కొందాం,వ్యవసాయం చేసుకుందాం అనేవాడు. అమ్మ ఇల్లు కట్టుకుందామని చెప్తుండేది. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవడం,పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడం సంతోషంగా ఉంది. ఇక

Read More »

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్* నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో

Read More »

“ప్రేమ”తో.. ఉన్నత శిఖరాలకు..!!

వర్షానికి తడిసిన మట్టి రోడ్డు. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది ఓ నాలుగేళ్ల చిన్నారి. అకస్మాత్తుగా కాలు మట్టిలో కూరుకుపోయింది. ఇంకేముంది భుజానికి ఉన్న పుస్తకాల బ్యాగ్‌తోపాటు తానూ కింద పడింది. ఒకవైపు కన్నీళ్లు

Read More »

 Don't Miss this News !