+91 95819 05907

కామ్రేడ్ రాదక్క మరణం విప్లవోద్యమానికి తీరని లోటు

– విప్లవోద్యమ నాయకురాలికి నివాళి CPI(ML)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు

నేటి గదర్, జూన్ 11,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :
అలవాల వంశీ 9052354516

సిపిఐ ఎంఎల్ ప్రతిఘటనోద్యమ నాయకురాలు కామ్రేడ్ రాదక్క మరణం విప్లవోద్యమానికి తీరని లోటు అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. ప్రముఖ ప్రతిఘటనోద్యమ, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ రాధక్క అలియాస్ నిర్మలక్క (86) మంగళవారం ఉదయం 9 గంటలకు హైదరాబాదులో మరణించారని అన్నారు. ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, ఆమె కుమార్తె ఇంటి వద్ద ఉంటూ వైద్య చికిత్సను పొందుతున్నారని తెలిపారు. ఆమె పార్థీవ దేహం సింగరేణి కాలనీలో కుమార్తె  ఇంటి వద్ద ఉన్నదని, ఆమె అంత్యక్రియలు 13వ తేదీ  గురువారం ఉదయం జరుగుతాయని పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో  సిపిఐ( ఎం.ఎల్) చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ పనిచేశారని గుర్తు చేశారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో ఆమె ప్రముఖ పాత్ర వహించారన్నారు. కడదాకా పీడిత ప్రజల ఉద్యమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటు సుదీర్ఘకాలం అజ్ఞాతవాసంలో గడిపారని వెల్లడించారు. అతివాద, మితవాదాలకి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాటం చేశారని, విప్లవోద్యమంలో ఆమె వివిధ బాధ్యతలు వహించారన్నారు. విప్లవఉద్యమంలో కొంతకాలం  జైలు జీవితం కూడా గడిపారని అన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేర్కొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !