+91 95819 05907

ప్రజా సమస్యల పరిష్కారం కై జూలై 22వ తారీఖున స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు జరగనున్న ధర్నాను జయప్రదం చేయండి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాలి.

సి పి ఐ యం ఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కమిటీ.

నేటి గదర్ న్యూస్,చర్ల:
చర్ల మండల పరిధిలోని చీమలపాడు,మొగలపల్లి, గొంపల్లి, తేగడ, దండుపేట కాలనీ, సి కత్తి గూడెం,లింగాపురం పాడు,పలు గ్రామాలను సిపిఐ యం ఎల్ మాస్ లైన్ ప్రజాపంధా పార్టీ చర్ల మండల నాయకత్వం గురువారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ జూలై 22వ తారీఖున స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఆయా పక్షాల ప్రజలకు పిలుపునిస్తూ కరపత్రాలను పంచడం జరిగిందని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల కోసం కొత్త పెన్షన్ల కోసం ఇండ్ల కోసం ఇండ్ల స్థలాల కోసం తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 100 రోజులలో ఆరు గ్యారంటీలని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి, రెండు, మాత్రమే అమలు చేశారని మిగిలిన హామీలను కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా అమలు చేయాలని మాస్ లైన్ పార్టీ భావిస్తున్నదన్నారు. లేని యెడల ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురుగాక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం తన వాగ్దానాలన్నిటిని తక్షణమే అమలు చేయాలని జూలై 22వ తారీఖున స్థానిక తాసిల్దార్ కార్యాలయాల ముందు జరగనున్న ధర్నాను ఆయా పక్షాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐకమత్య పోరాటాలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకురాలు ఎస్.కె మహముద, చేన్నo మోహన్, గ్రామస్తులు కుమారి, సుశీల, నాగమణి, పున్నారావు, ప్రశాంతి, జానకమ్మ, లక్ష్మి, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !