-ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్
పినపాక :ప్రముఖ సినీగేయ రచయిత, వాగ్గేయకారుడు ప్రజా కవి వరంగల్ శ్రీనివాస్ గారు రచించిన “నూరేళ్ల నా ఊరు”గేయ కావ్యం 243 చరణాలతో 243 మంది గాయని&గాయకుల చేత పాడించాలనే సంకల్పం తో కళాకారుల ఎంపిక ఫిబ్రవరి 4వ తేదిన, శనివారం ఉదయం 9:00 గంటల నుండి ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ భవనం అందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని ప్రముఖ ప్రజా గాయకుడు రచయిత సిద్దెల హుస్సేన్ పత్రికా సమావేశంలో తెలియజేశారు.
అనంతరం పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమం పాట ప్రదర్శన ఉంటుందని
ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మట్టి గొంతులను వెలికి తీసి ఈ పాటలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో,
నూరేండ్ల ఊరు ఎట్లుండెను, ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో,సమాజం ప్రస్తుతం ఎంత మార్పు జరిగిందో, మనుషుల్లో వచ్చినటువంటి మార్పుని మానసిక పరిస్థితులను గురించి విపులంగా విశదీకరించి కవితాత్మకంగా రాసిన సుదీర్ఘ గేయ కావ్యం పాడడం కోసం కళాకారులను ఎంపిక చేయడం నిజంగా సంతోషించదగినటువంటి విషయం అని సిద్దెల హుస్సేన్ తెలిపారు,
ఇంత గొప్ప కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాకారులు భాగస్వామ్యం అవ్వడం అనేది మనకు దక్కిన వరంగా భావిస్తూ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని కళాకారులు ఎవరైనా సరే తమకు నచ్చిన పాటను పాడి వరంగల్ శ్రీనన్నను మెప్పించి ఈ 243 చరణాల పాటలో భాగస్వామ్యం అవ్వడానికి అవకాశం పొందాలని,
అనే విషయాన్ని తెలియజేస్తూ మనం పాడే పాటలకు న్యాయ నిర్ణేత గా “నూరేళ్ళ నా ఊరు” గేయకావ్య రచయిత వరంగల్ శ్రీను పాల్గొంటారు,
కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని కళాకారులకు గొప్ప సదవకాశంగా భావించి పెద్ద ఎత్తున ఈ గాయని గాయకుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొని మీ మీ ప్రతిభను వెలికి తీసే విధంగా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, ఎంపిక కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు భోజనం వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని సిద్దెల హుస్సేన్ తెలియజేశారు
